
Updated : 02 Nov 2021 19:50 IST
TS News: బండి సంజయ్కు హోం మంత్రి అమిత్ షా ఫోన్
హైదరాబాద్: హుజూరాబాద్ ఉప పోరులో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్దకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను భుజాలపైకి ఎత్తుకుని హర్షం వ్యక్తం చేశారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. డప్పు వాయిద్యాలు మధ్య నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా బండి సంజయ్కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయటం వలనే హుజూరాబాద్లో భాజపా గెలుస్తోందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
Advertisement
Tags :