Telangana News: తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ పాలన కోరుకుంటున్నారు: లక్ష్మణ్
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని భాజపా నేత లక్ష్మణ్ విమర్శించారు.
హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని భాజపా నేత లక్ష్మణ్ విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. తెరాస వైఫల్యాలను ఎత్తి చూపుతూ, ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించాలనే సంకల్పంతోనే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టినట్లు చెప్పారు. 31 రోజుల యాత్రలో రెండో రోజే కడుపు మంటతో తెరాస నేతలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి వేస్తే ఉరే.. అని చెప్పి కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 24 గంటల పాటు నిరంతర విద్యుత్ ఇస్తున్నట్లు చెబుతోన్న రాష్ట్ర ప్రభుత్వం.. పంట చేతికొచ్చే సమయానికి రైతులకు కేవలం 7 గంటల విద్యుత్ మాత్రమే సరఫరా చేస్తుందన్నారు. వేగవంతమైన అభివృద్ధి, చిట్టచివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందేలా రాష్ట్ర ప్రజలు మోదీ తరహా డబుల్ ఇంజిన్ పాలనను కోరుకుంటున్నారని లక్ష్మణ్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!