Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలు.. 14 మంది అభ్యర్థులతో భాజపా జాబితా

రాజ్యసభ ఎన్నికలకు భాజపా అభ్యర్థుల జాబితా విడుదలైంది.

Published : 11 Feb 2024 20:54 IST

దిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్లకు గడువు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. బెంగాల్‌లో ఐదు స్థానాలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ నలుగురి పేర్లను ఖరారు చేయగా.. తాజాగా భాజపా ఏడు రాష్ట్రాల్లో 14 మంది పేర్లను ఎంపిక చేసి  జాబితాను విడుదల చేసింది.  దీంట్లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఏడుగురు, బిహార్‌ (2), ఛత్తీస్‌గఢ్‌ (1), హరియాణా (1), కర్ణాటక(1), ఉత్తరాఖండ్‌ (1), పశ్చిమబెంగాల్‌ (1) చొప్పున అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. 

ఏ రాష్ట్రం నుంచి ఎవరంటే..?

  • ఉత్తరప్రదేశ్‌ - ఆర్‌పీఎన్‌ సింగ్‌, డా. సుధాన్షు త్రివేది, చౌదరి తేజ్‌వీర్‌ సింగ్‌, సాధనా సింగ్‌, అమర్‌పాల్‌ మౌర్య, సంగీత బల్వంత్‌, నవీన్‌ జైన్‌
  • బిహార్‌ -  డా. ధర్మశీల గుప్తా, భీమ్‌ సింగ్‌
  • ఛత్తీస్‌గఢ్‌- రాజా దేవేంద్ర ప్రతాప్‌ సింగ్‌
  • హరియాణా - సుభాష్‌ బరాలా
  • కర్ణాటక - నారాయణ కష్ణస భండగే
  • ఉత్తరాఖండ్‌ - మహేంద్ర భట్‌
  • పశ్చిమబెంగాల్‌ - సమిక్‌ భట్టాచార్య

రాజ్యసభ రేసులో సాగరిక ఘోష్‌.. నలుగురి పేర్లు ఖరారు చేసిన టీఎంసీ

15 రాష్ట్రాల నుంచి ఏప్రిల్‌లో ఖాళీ అయ్యే 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.  ఫిబ్రవరి 8 నుంచి రాజ్యసభ ఎన్నిలకు దరఖాస్తులు స్వీకరణ మొదలవ్వగా.. ఫిబ్రవరి 15తో ముగియనుంది.  ఫిబ్రవరి 27న పోలింగ్‌ నిర్వహించి అదేరోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 స్థానాలకు పోలింగ్‌ జరగనుండగా.. బిహార్‌లో 6, మహారాష్ట్రలో 6, పశ్చిమబెంగాల్‌లో 5, మధ్యప్రదేశ్‌ 5, గుజరాత్‌ 4, కర్ణాటకలో 4, ఒడిశా, రాజస్థాన్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మూడేసి చొప్పున స్థానాలకు; హరియాణా, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో ఒక్కో రాజ్యసభ స్థానానికి పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని