Rajyasabha Elections: ఒడిశా నుంచి అశ్వినీ వైష్ణవ్.. ఐదుగురితో భాజపా రాజ్యసభ అభ్యర్థుల రెండో జాబితా
రాజ్యసభ ఎన్నికల కోసం భాజపా ఐదుగురు అభ్యర్థులతో రెండో జాబితాను బుధవారం విడుదల చేసింది.
దిల్లీ: రాజ్యసభ ఎన్నికల (Rajyasabha Elections) కోసం భాజపా (BJP) ఐదుగురు అభ్యర్థులతో ·రెండో జాబితాను బుధవారం విడుదల చేసింది. ఒడిశా నుంచి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, మధ్యప్రదేశ్ నుంచి మరో మంత్రి ఎల్. మురుగన్ బరిలో ఉంటారని తెలిపింది. ఈ దఫా ఎన్నికైతే వీరివురు రెండోసారి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. ఒడిశాలో అశ్వినీ వైష్ణవ్కి అధికార బిజూ జనతాదళ్ (BJD) మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. మధ్యప్రదేశ్లో మొత్తం ఐదు రాజ్యసభ స్థానాలకు పోటీ జరగనుంది. వీటిలో నాలుగు భాజపా, ఒకటి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి మురుగన్తోపాటు ఉమేశ్ నాథ్ మహరాజ్, మాయ మరోలియా, బన్సీలాల్ గుర్జార్లను భాజపా అభ్యర్థులుగా ప్రకటించింది. రాజస్థాన్లో ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు మాజీ మంత్రి చున్నీలాల్ గరాసియా, మాజీ ఎమ్మెల్యే మదన్ రాథోడ్లు పోటీ చేస్తారని భాజపా తెలిపింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ల పదవీ కాలం ఏప్రిల్ 3తో ముగియనుంది.
గత ఆదివారం రాజ్యసభకు 14 మంది అభ్యర్థులతో భాజపా మొదటి విడత జాబితా విడుదల చేసింది. ఉత్తర్ప్రదేశ్ (7), బిహార్ (2), ఛత్తీస్గఢ్ (1), హరియాణా (1), కర్ణాటక(1), ఉత్తరాఖండ్ (1), పశ్చిమబెంగాల్ (1) రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థిత్వాలు ఇందులో ఉన్నారు. ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్న రాజ్యసభ సభ్యుల్లో సుధాంశు త్రివేదికి మాత్రమే తిరిగి అవకాశం దక్కింది. కేంద్ర మాజీ మంత్రి ఆర్.పి.ఎన్.సింగ్ పేరు కూడా జాబితాలో ఉంది. కొత్తవారికి పార్టీ ప్రాధాన్యం ఇచ్చింది. జాబితాలో లేని పలువురు కేంద్రమంత్రులు రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీచేయవచ్చని తెలుస్తోంది. 15 రాష్ట్రాల నుంచి ఏప్రిల్లో ఖాళీ అయ్యే 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి