Chandrababu: ఓట్ల కోసం జగన్ దొంగ జపం.. మోసపోవద్దు: చంద్రబాబు
వైకాపా (YSRCP) అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై ఎన్నో దాడులు జరిగాయని తెదేపా(TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు.
నిడదవోలు: వైకాపా (YSRCP) అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై ఎన్నో దాడులు జరిగాయని తెదేపా(TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కఠోర క్రమశిక్షణతో ముస్లింలు రంజాన్ దీక్ష చేస్తారన్నారు. నిడదవోలులో వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
తెదేపా ప్రభుత్వ హయాంలో హైదరాబాద్, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీలు ఏర్పాటు చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. కడప, విజయవాడలో హజ్ హౌస్ నిర్మించి యాత్రకు ఆర్థిక సహకారం అందించామన్నారు. రంజాన్ తోఫా ఇచ్చామని చెప్పారు. ముస్లింల వివాహానికి దుల్హన్ పథకం కింద ఆర్థిక సాయం అందజేశామని వివరించారు. మైనార్టీలకు జగన్ ఏమిచ్చారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
‘‘ముస్లిం విద్యార్థులకు ప్రపంచంలో ఎక్కడైనా చదువుకునే అవకాశం ఇచ్చాం. విదేశీ చదువుల కోసం రూ.15లక్షలు ఇస్తే.. జగన్ ఆ పథకం ఆపేశారు. కడపలో హజ్ హౌస్ నిర్మాణం 90 శాతం మేం చేస్తే మిగిలిన 10 శాతం కూడా జగన్ పూర్తిచేయలేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకే మూడు పార్టీలు కలిశాయి. వైకాపా పాలనలో మైనార్టీలపై జరిగిన దాడులు కోకొల్లలు. నాలాంటివాడినే ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. వారికి సామాన్యులు ఓ లెక్కా. నంద్యాల జిల్లాలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునేలా వైకాపా నేతలు వేధించారు. సీఏఏకు మద్దతు తెలిపి మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్న వ్యక్తి జగన్. ఓట్ల కోసం ఆయన దొంగ జపం చేస్తున్నారు.. మోసపోవద్దు’’ అని చంద్రబాబు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!