ఆ భయంతోనే స్టాలిన్‌ నా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు: పళనిస్వామి

Palaniswami: భాజపాతో డీఎంకే బంధం తెంచుకున్న తర్వాత సీఎం స్టాలిన్‌ తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయమే అందుకు కారణమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి అన్నారు.

Published : 24 Oct 2023 22:52 IST

చెన్నై: ఎన్నికల్లో ఓటమి భయం వల్లే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. డీఎంకే పార్టీ సమావేశాల్లో కూడా ఆ పార్టీ అధ్యక్షుడు తనను విమర్శించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని స్టాలిన్‌ను ఉద్దేశించి అన్నారు. ఎన్నికల సన్నద్ధత గురించి డీఎంకే సమావేశాల్లో మాట్లాడుకుంటే తనకెలాంటి అభ్యంతరం లేదన్న పళని.. కాకపోతే తనను విమర్శించేందుకు సమయం కేటాయిస్తున్నారన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి ఖాయమని స్టాలిన్‌కు అర్థమైనందునే అలా చేస్తున్నారని తెలిపారు.

కుటుంబాల మధ్య పోరులో విజయం ఎవరిదో?

సేలం జిల్లాలోని ఓమలూరులో పళనిస్వామి మీడియాతో మాట్లాడుతూ.. భాజపాతో అన్నాడీఎంకే తెగదెంపులు చేసుకోవడం ద్వారా సీఎం స్టాలిన్‌ను ఇరుకున పెట్టినట్లయిందన్నారు. ఆ పరిణామం తర్వాతే స్టాలిన్‌ తమపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని.. ఆయనలో ఆందోళన స్పష్టంగా కనబడుతోందన్నారు. రాష్ట్రంలో గతంలో అన్నాడీఎంకే ప్రారంభించిన కొన్ని ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారే తప్ప కొత్త ప్రాజెక్టులేవీ అమలు చేయలేదని పళనిస్వామి ఆరోపించారు. డీఎంకే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని చెబుతున్న స్టాలిన్‌.. గత 29 నెలల పాలనలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలూ తీసుకురాలేదని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని