Sanjay Raut: అందుకే క్రికెట్ మొత్తాన్ని అహ్మదాబాద్కు తరలించేశారు.. రౌత్ ఆరోపణ
భాజపా రాజకీయాల వల్లే క్రికెట్ మొత్తం ముంబయి నుంచి అహ్మదాబాద్కు తరలిందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు.
ముంబయి: అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపానుద్దేశించి ఆయన తనదైన శైలిలో విమర్శించారు. భాజపా రాజకీయాల వల్లే క్రికెట్ ముంబయి నుంచి అహ్మదాబాద్కు తరలిపోతోందన్నారు. క్రికెట్ను భాజపా ఓ రాజకీయ కార్యక్రమంలా నిర్వహించాలనుకుంటోందని ఆరోపించిన రౌత్.. క్రికెట్కు సంప్రదాయ పవర్ హౌస్గా ఉన్న ముంబయి నగరం నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్కు తరలించారని ఆరోపించారు.
‘వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుతోంది. ఇంతకముందు క్రికెట్కు ముంబయి కేంద్రంగా ఉండేది. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు దిల్లీ, ముంబయి లేదా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగేవి. క్రికెట్ను పొలిటికల్ ఈవెంట్లా నిర్వహించాలని భాజపా భావించడం వల్ల మొత్తం క్రికెట్ను ముంబయి నుంచి అహ్మదాబాద్కు తరలించారు. భాజపా తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆఖరుకు క్రికెట్ను సైతం వదిలిపెట్టడం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
టోంక్పై మరోసారి ‘పైలట్’ గురి.. స్థానికతే భాజపా అస్త్రం!
గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్ద మైదానం. దాదాపు 1.32లక్షల మంది ప్రేక్షకులు ఒకేసారి మ్యాచ్ను వీక్షించేలా నిర్మించారు. ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగానే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!