ఇతర పార్టీల్లో చేరొచ్చు: టీమ్ రజనీకాంత్
ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సూపర్స్టార్ రజనీకాంత్ పార్టీ ఏర్పాటు ఆలోచన విరమించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీ మక్కళ్మండ్రం సభ్యులు ఇతర పార్టీల్లో నిరభ్యరంతంగా చేరొచ్చని టీమ్ రజనీ వెల్లడించారు.
చెన్నై: ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సూపర్స్టార్ రజనీకాంత్ పార్టీ ఏర్పాటు ఆలోచన విరమించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీ మక్కళ్మండ్రం సభ్యులు ఇతర పార్టీల్లో నిరభ్యరంతంగా చేరొచ్చని టీమ్ రజనీ వెల్లడించింది. సోమవారం కొందరు రజనీ మక్కళ్ మండ్రం జిల్లా అధ్యక్షులు తమిళనాడు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే పార్టీలో చేరడంతో రజనీ బృందం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇతర పార్టీల్లో చేరినప్పటికీ వారు రజనీ అభిమానులేనన్న విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు.’’ అని రజనీ అభిమానుల వేదిక పేర్కొంది. కొన్ని నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో రజనీకాంత్ భాజపాకు తన మద్దతునిస్తారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
గత డిసెంబరు నెలలో రజనీ తన పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించేందుకు సిద్ధమైన తరుణంలో అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాల్లోకి రావడంలేదని ప్రకటించారు. ‘‘రాజకీయాల్లోకి రావొద్దని దైవం నుంచి ఒక హెచ్చరిక వచ్చింది. నేను రాజకీయాల్లోకి రాకపోయినా ప్రజలకు నా సేవలను అందిస్తాను.’’ అని రజనీ వెల్లడించారు. దీంతో రజనీ అభిమానులు తీవ్రనిరాశకు గురయ్యారు. మరోవైపు తమిళనాడు భాజపా అధ్యక్షుడు సీటీ రవి రజనీ మద్దతు కోరుతూ ఆయన్ను కలుస్తానని వెల్లడించారు. ‘‘ రజనీ ఎప్పుడూ దేశం, తమిళనాడు అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తారు. ఆయన గొప్ప నాయకుడు. ప్రధాని మోదీకి ఎంత ఆత్మీయుడో మనకు తెలిసిందే.’’ అని సీటీ రవి తెలిపారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..