టీడీఎల్పీ సమావేశానికి 5 ఎమ్మెల్సీల గైర్హాజరు
ఏపీ శాసనమండలి రద్దు ప్రచారం నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశమైంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నేతలో చంద్రబాబు భేటీ అయ్యారు.
మంగళగిరి: ఏపీ శాసనమండలి రద్దు ప్రచారం నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశమైంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నేతలో చంద్రబాబు భేటీ అయ్యారు. రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. మండలిలో తెదేపా తరఫున 32 మంది ఎమ్మెల్సీలుండగా సమావేశానికి 23 మంది హాజరయ్యారు.
మరోవైపు టీడీఎల్పీ భేటీకి రాలేమని ఐదుగురు ఎమ్మెల్సీలు గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల, రామకృష్ణ ముందుగానే సమాచారమిచ్చారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు వర్ధంతి దృష్ట్యా సమావేశానికి రాలేనని గాలి సరస్వతి, తన మేనత్త కర్మ కార్యక్రమం ఉండటం వల్ల సమావేశానికి హాజరవ్వలేనని కేఈ ప్రభాకర్ తెలిపారు. ఆరోగ్యం బాగాలేనందున సమావేశానికి రాలేనని శత్రుచర్ల తెలుపగా..తన నివాసంలో పెళ్లి ఉండటంతో రాలేకపోతున్నానని తిప్పేస్వామి పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నందున రాలేకపోతున్నానని రామకృష్ణ అన్నారు.
తమ ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ యత్నిస్తోందని తెదేపా ఆరోపించింది. ఎమ్మెల్సీలతో ఎప్పటికప్పుడు పార్టీ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. మండలిలో తెదేపాకు 32 మంది ఎమ్మెల్సీల బలం ఉంది. అయితే ఇప్పటికే పోతుల సునీత, శివనాథరెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. మండలిని సమావేశపరిస్తే సభ్యులు చేజారకుండా వ్యూహ రచన చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం