ఆటో డ్రైవర్లే వీఐపీలు: ఆప్
దిల్లీ: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం అంటేనే రాజకీయ నాయకులు, కేంద్ర, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, వారి బంధువులే వీఐపీలుగా ఉంటారు. కానీ, దీనికి భిన్నంగా ఆమ్ఆద్మీ పార్టీ ఈసారి సాధాసీదా వ్యక్తులను వీఐపీలుగా ఆహ్వానిస్తోంది.
ప్రమాణస్వీకారానికి సామాన్యులను ఆహ్వానించిన కేజ్రీవాల్
దిల్లీ: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం అంటేనే రాజకీయ నాయకులు, కేంద్ర, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, వారి బంధువులే వీఐపీలుగా ఉంటారు. కానీ, దీనికి భిన్నంగా ఆమ్ఆద్మీ పార్టీ ఈసారి సాధాసీదా వ్యక్తులను వీఐపీలుగా ఆహ్వానిస్తోంది. ఆదివారం జరగబోయే కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి దాదాపు యాభైమంది సామాన్యులు కేజ్రీవాల్తో వేదిక పంచుకోబోతున్నట్లు ఆమ్ఆద్మీ నేత మనీష్ సిసోడియా వెల్లడించారు. రామ్లీలా మైదానంలో జరగబోయే ఈ కార్యక్రమానికి అట్టడుగువర్గాల వారిని ఆహ్వానించాలని కేజ్రీవాల్ నిర్ణయించినట్లు తెలిపారు.
ముఖ్యంగా ఆటో, అంబులెన్స్, బస్సు డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పాఠశాల ప్యూన్లు, మొహల్లా క్లినిక్ డాక్టర్లు, ఇలా వివిధ వర్గాలకు చెందిన యాభై మందిని ఆహ్వానించామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ మధ్యే మాస్కో ఒలింపియాడ్లో పథకాలు సాధించిన విద్యార్థులు, ఉద్యోగ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలను కూడా ఆహ్వానించామన్నారు. రేపు జరగబోయే కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించారు కేజ్రీవాల్. అయితే వారణాసి పర్యటన దృష్ట్యా దీనికి హాజరు అవుతారా?లేరా?అన్నది ఇంకా ఖరారు కావాల్సిఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.