Bharat Jodo Yatra: జోడో యాత్ర సాగిన చోట జయభేరి

కర్ణాటకలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర సాగిన ప్రాంతాల్లో ఘన విజయం సాధించామని కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది.

Published : 14 May 2023 07:19 IST

20లో 15 చోట్ల గెలిచాం: కాంగ్రెస్‌

దిల్లీ: కర్ణాటకలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర సాగిన ప్రాంతాల్లో ఘన విజయం సాధించామని కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. 15 నియోజకవర్గాల్లో పార్టీ గెలిచిందని పేర్కొంది. ‘భారత్‌ జోడో యాత్ర 20 నియోజకవర్గాల్లో సాగింది. అందులో 15 చోట్ల గెలిచాం. మూడు చోట్ల జేడీఎస్‌, రెండు చోట్ల భాజపా గెలిచాయి. 2018లో ఈ 20 నియోజకవర్గాల్లో 5 చోట్లే గెలిచాం. అప్పట్లో భాజపా 9చోట్ల, జేడీఎస్‌ 6చోట్ల గెలిచాయి. అంటే నేరుగా యాత్ర ప్రభావం చూపినట్లే’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ట్వీట్‌ చేశారు. కర్ణాటకలో రాహుల్‌ గాంధీ 22 రోజులపాటు 500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయనకు భారీ మద్దతు లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని