Chandrababu: మోదీ అధ్యక్షతన సమావేశం.. చంద్రబాబుకు ఆహ్వానం
తెదేపా అధినేత చంద్రబాబు డిసెంబర్ 5న దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.
దిల్లీ: జీ-20 దేశాల కూటమికి అధ్యక్షత వహిస్తున్న భారత్.. వచ్చే ఏడాది ఈ సదస్సు నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సదస్సు ఏర్పాటుపై దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 5న సమావేశం కానున్నారు. ఈ మేరకు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానం పంపింది. ఇందులో పాల్గొనేందుకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కూడా డిసెంబర్ 5న దిల్లీ వెళ్లనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో.. మన దేశంలో నిర్వహించే జీ-20 సదస్సుపై ప్రధానంగా చర్చించనున్నారు. దీని ద్వారా రాజకీయ పార్టీల సూచనలు, అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం తెలుసుకోనుంది. డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. ఇందుకోసం అన్ని పార్టీల అధ్యక్షులకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రులు అర్జున్రాం మేఘ్వాల్, మురళీధరన్లు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఈ భేటీ ముఖ్య ఉద్దేశం, అజెండాను వివరించారు. కాంగ్రెస్, బీఎస్పీ, తెరాస, తెదేపా సహా 15 పార్టీల అధ్యక్షులతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఫోన్లో మాట్లాడగా.. వామపక్ష పార్టీలు సహా మరికొన్ని పార్టీల ప్రధాన నేతలతో అర్జున్రాం మేఘ్వాల్, మురళీధరన్లు మాట్లాడి కార్యక్రమ అజెండాను వివరించారు. ఇటీవల ఇండోనేసియా బాలిలో జరిగిన కార్యక్రమంలో సదస్సు అధ్యక్ష బాధ్యతలను ప్రధాని మోదీ స్వీకరించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
-
ఆడపిల్ల పుడితే రూ.2వేల డిపాజిట్.. యువ జంట వినూత్న నిర్ణయం
-
హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు