Rahul Gandhi: కూటమి విజయం సాధిస్తే.. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే.. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.
రాంచీ: రిజర్వేషన్లపై కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీలక ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా’ (INDIA) కూటమి విజయం సాధిస్తే.. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తామని చెప్పారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని తెలిపారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)లో భాగంగా ఝార్ఖండ్ (Jharkhand)లో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈసందర్భంగా సైకిల్పై బొగ్గు తీసుకెళుతున్న యువతతో కాసేపు ముచ్చటించారు.
‘‘ఆదివాసీలకు, దళితులకు కల్పించే రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదు. దేశంలో వెనకబడిన కులాల వారు తప్పకుండా తమ హక్కులు పొందుతారు. కార్పొరేట్ సంస్థలు, ఆసుపత్రులు, పాఠశాలల్లో వారి భాగస్వామ్యాన్ని తగ్గించి, కార్మికులుగా మార్చారు. ఇది సామాజిక, ఆర్థికపరమైన సమస్య. ‘ఇండియా’ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేయడంతోపాటు, దేశవ్యాప్తంగా కులగణన చేపడతాం. ఎన్నికల సమయంలో మాత్రమే మోదీకి ఓబీసీ అనే విషయం గుర్తొస్తుంది. కులగణన కోరిన ప్రతిసారీ దేశంలో ఉన్నది ధనిక, పేద అనే రెండు కులాలు మాత్రమేనని చెబుతారు’’ అని రాహుల్ ఆరోపించారు.
ఎట్టకేలకు వీడిన అనిశ్చితి.. బలపరీక్షలో నెగ్గిన చంపయీ ప్రభుత్వం
ఝార్ఖండ్ అసెంబ్లీలో చంపయీ సోరెన్ బలపరీక్షలో విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ‘‘కాంగ్రెస్-జేఎమ్ఎమ్లు కలిసికట్టుగా ప్రభుత్వాన్ని కాపాడుకున్నాయి. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడులు చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ధనం, దర్యాప్తు సంస్థల అండతో ప్రభుత్వాలను కూల్చేయాలనుకుంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఇండియా కూటమి ఏర్పడింది’’ అని రాహుల్ గాంధీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్