Chandrababu arrest: ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగించాలి: చంద్రబాబు

ప్రజా సమస్యలపై పోరాట పంథా వీడొద్దని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారని ఆ పార్టీ సీనియర్‌నేత పయ్యావుల కేశవ్‌ తెలిపారు.

Updated : 10 Oct 2023 19:58 IST

రాజమహేంద్రవరం: ప్రజా సమస్యలపై పోరాట పంథా వీడొద్దని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారని ఆ పార్టీ సీనియర్‌నేత పయ్యావుల కేశవ్‌ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో తెదేపా అధినేత చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, పయ్యావుల కేశవ్‌ల ములాఖత్‌ ముగిసింది. అనంతరం జైలు వద్ద పయ్యావుల కేశవ్‌ మీడియాతో మాట్లాడారు.

‘‘చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత మాలో ధైర్యం వచ్చింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పారు. ప్రజలు, పార్టీ నేతలు ఏవిధంగా ఉన్నారనే ఆవేదన చంద్రబాబులో ఉంది. సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టును జగన్‌ ముందుకు తీసుకెళ్లనీయలేదన్నారు. ప్రాజెక్టులు చేపట్టట్లేదని సమరభేరి ఎంచుకుని చంద్రబాబు ప్రజల్లోకి వచ్చారు. చంద్రబాబు పోరాటంతో ప్రజల్లో స్పందన చూసి ప్రభుత్వం భయపడి ఆయన్ను అరెస్టు చేసింది’’ అని పయ్యావుల కేశవ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని