గోవా, ఉత్తరాఖండ్కు మళ్లీ వారే.. ప్రమోద్ సావంత్, పుష్కర్ సింగ్ ధామీకి మరో ఛాన్స్
ఉత్తరాఖండ్ సీఎం ఎవరనే సస్పెన్స్కు తెరపడింది. తదుపరి ముఖ్యమంత్రిగా మళ్లీ పుష్కర్ సింగ్ ధామీకే వరుసగా రెండోసారి భాజపా అవకాశం కల్పించింది. ఇటీవల జరిగిన ......
దేహ్రాదూన్/పనాజీ: గోవా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రుల విషయంలో సస్పెన్స్ వీడింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ మొన్నటి వరకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ప్రమోద్ సావంత్, పుష్కర్ సింగ్ ధామీవైపే భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపింది. దీంతో వరుసగా రెండోసారి వీరిద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు కొలువుదీరడమే తరువాయి.
సావంత్ ఏకగ్రీవంగా..
ఇటీవల గోవాలో జరిగిన ఎన్నికల్లో 40 స్థానాలకు గానూ భాజపా 20 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, ముగ్గురు స్వతంత్రులు భాజపాకు మద్దతు తెలపడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అయితే, ముఖ్యమంత్రి పీఠం ఎవరికి అప్పగించాలన్న విషయంలో సందిగ్ధం నెలకొంది. ప్రమోద్ సావంత్తో పాటు, విశ్వజిత్ రాణే పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గోవా ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తున్న కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, దేవేంద్ర ఫడణవీస్ సోమవారం గోవా చేరుకున్నారు. ప్రమోద్ సావంత్ను శాసనసభా పక్షం ఏకగ్రీవంగా తమ నాయకుడిని ఎన్నుకున్నట్లు తోమర్ వెల్లడించారు. రాబోయే ఐదేళ్ల పాటు శాసనసభా పక్ష నాయకుడిగా సావంత్ వ్యవహరించనున్నారని తెలిపారు.
ఎన్నికల్లో ఓడినా ధామీ వైపే మొగ్గు..
ఇటీవల ఎన్నికల ఫలితాల్లో ఉత్తరాఖండ్లో 70 స్థానాలకు గాను 47 చోట్ల భాజపా విజయ దుందుభి మోగించింది. తన సొంత స్థానం ఖటిమాలో ధామీ ఓటమి పాలయ్యారు. దీంతో తదుపరి సీఎం ఎవరనే అంశంపై గత పది రోజులుగా ఉత్కంఠ కొనసాగింది. సీఎం రేసులో పుష్కర్సింగ్ ధామీ ముందు వరుసలో ఉండగా.. మాజీ సీఎం త్రివేంద్రసింగ్ రావత్, మాజీ కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, సీనియర్ నేత సత్పాల్ మహారాజ్ వంటి వారి పేర్లు కూడా వినబడ్డాయి. అయితే, ఎన్నికల్లో ఆయన ఓడినప్పటికీ భాజపాను విజయతీరాలకు చేర్చడంలో 46 ఏళ్ల వయసు కలిగిన ఈ యువనేత చేసిన కృషిని గుర్తించి భాజపా ఆయనకే మళ్లీ సీఎం పగ్గాలు అప్పగించినట్టు సమాచారం. భాజపా కేంద్ర పరిశీలకులుగా ఉన్న రాజ్నాథ్ సింగ్, మీనాక్షి లేఖి ఉత్తరాఖండ్లో పర్యటించారు. పార్టీ నేతలతో సంప్రదింపుల అనంతరం పుష్కర్సింగ్ ధామీని ఉత్తరాఖండ్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైనట్టు రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ధామి సారథ్యంలో ఉత్తరాఖండ్ వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత పుష్కర్ సింగ్ ధామీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960