Chandrababu: ఓటమి ఖాయమని తెలిసే జగన్ మాటల్లో తేడా వచ్చింది: చంద్రబాబు
ప్రజలను చైతన్యపరిచి.. రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పడానికే ఉరవకొండకు వచ్చినట్లు తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
ఉరవకొండ: ప్రజలను చైతన్యపరిచి.. రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పడానికే ఉరవకొండకు వచ్చినట్లు తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇక్కడ తెదేపా-జనసేన గాలి వీస్తోందని, ఈ సభకు వచ్చిన ప్రజలను చూస్తే సీఎం జగన్కు నిద్ర పట్టదని వ్యాఖ్యానించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 సీట్లలో తెదేపా-జనసేన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉరవకొండలో నిర్వహించిన రా.. కదలిరా.. బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు.. వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
‘‘ఓటమి ఖాయమని తెలిసే జగన్ మాటల్లో తేడా వచ్చింది. హ్యాపీగా దిగిపోతా అని ఇప్పుడు అంటున్నారు. రాష్ట్రానికి పట్టిన శని పోయేందుకు ఇంకా 74 రోజులే ఉంది. వైకాపా పాలనలో నష్టపోని వ్యవస్థ ఒక్కటీ లేదు. రాష్ట్రం ఒక్కసారిగా 30 ఏళ్లు వెనక్కి పోయింది. అనంతపురం జిల్లాకు నీరు ఇస్తే బంగారం పండిస్తారు. ఈ జిల్లాలో ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలనేది నా లక్ష్యం. రూ.4,500 కోట్లు ఖర్చు పెట్టి హంద్రీనీవా, కాలువల విస్తరణ పనులు చేశాం. గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకురావాలని అనుకున్నాం. 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించాం.
ఎన్నికల సమయంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఎవరిని మోసం చేస్తారు?
ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేందుకు యువత సిద్ధమైంది. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు?ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా మేం చేస్తే.. ఈ ప్రభుత్వం మాత్రం ఫిష్ మార్ట్, మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు ఇచ్చింది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పరిశ్రమలను తరిమేశారు. పరిశ్రమలు వచ్చి ఉంటే లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి. కమీషన్లు ఇవ్వలేక అనేక పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. మీరు పది అడుగులు ముందుకు వేయండి.. నేను వంద అడుగులు వేస్తా. 2047 నాటికి తెలుగుజాతి నంబర్ వన్ కావాలి. యువతకు ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తాం’’ అని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..