Chandrababu: పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్‌.. తరిమికొట్టడం జగన్‌ బ్రాండ్‌: చంద్రబాబు

రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలే తేల్చాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 

Published : 28 Mar 2024 20:44 IST

కదిరి: రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలే తేల్చాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. గురువారం రాత్రి సత్యసాయి జిల్లా కదిరిలో నిర్వహించిన ప్రజాగళం రోడ్‌ షోలో ఆయన పాల్గొన్నారు.

‘‘రాయలసీమ కోసం జగన్‌ చేసిందేమీ లేదు. ఐదేళ్లలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. రాయలసీమలో 142 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉంటే రద్దు చేశారు. తెదేపా హయాంలో సీమలో రూ.12వేల కోట్లు ఖర్చు చేశాం. వర్షపు నీటి భూగర్భ జలాలుగా మార్చాం. 10లక్షల పంట కుంటలు తవ్వాం. చెక్ డ్యామ్‌లు కట్టాం.. బిందు సేద్యానికి 90శాతం రాయితీ ఇచ్చాం. కియా వంటి పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్‌.. పరిశ్రమలు తరిమికొట్టడం జగన్‌ బ్రాండ్‌’’ అని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని