Prashant Kishor: అదేం ఒక వ్యక్తికి సంక్రమించిన హక్కు కాదు.. రాహుల్పై కిశోర్ విమర్శలు..!
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఇంటా, బయట విమర్శలు ఎక్కువవుతున్నాయి. నిన్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ యూపీఏ అస్తిత్వాన్నే ప్రశ్నించగా.. తాజాగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా ఆ తరహా వ్యాఖ్యలే చేశారు. గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్ 90 శాతానికి పైగా ఎన్నికల్లో ఓడిపోయిందని, నాయకత్వం ఓ వ్యక్తి దైవిక హక్కు కాదంటూ ట్వీట్ చేశారు.
దిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఇంటా, బయట విమర్శలు ఎక్కువవుతున్నాయి. నిన్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ యూపీఏ అస్తిత్వాన్నే ప్రశ్నించగా.. తాజాగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా ఆ తరహా వ్యాఖ్యలే చేశారు. గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్ 90 శాతానికి పైగా ఎన్నికల్లో ఓడిపోయిందని, నాయకత్వం ఓ వ్యక్తి దైవిక హక్కు కాదంటూ ట్వీట్ చేశారు.
‘బలమైన ప్రతిపక్షానికి కాంగ్రెస్ పార్టీ కీలకమే. గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ 90 శాతం ఎన్నికల్లో ఓటమి చవిచూసిన వేళ.. ఆ పార్టీ నాయకత్వం ఒక వ్యక్తికి మాత్రమే దైవిక హక్కు కాదు. ప్రతిపక్ష నాయకత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయించుకుందాం’ అంటూ రాహుల్ గాంధీ నాయకత్వంపై కిశోర్ పరోక్షంగా విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా.. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని, కీలకంగా వ్యవహరిస్తారని వార్తలు వచ్చినా.. పార్టీలో అంతర్గతంగా వచ్చిన వ్యతిరేకత వల్ల అది సాధ్యం కాలేదని తెలిసింది. గాంధీ కుటుంబంతో జరిపిన చర్చలు విఫలమైన దగ్గరి నుంచి ఆయన పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. లఖింపుర్ ఖేరీ ఘటనలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన స్పందనపై ప్రజలు అసంతృప్తికి గురయ్యారని, పార్టీలో నిర్మాణాత్మక సమస్యల వల్ల పరిష్కారాలు వెంటనే లభించడం లేదని గతంలో ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం