Karnataka Politics: నాకు కేబినెట్ హోదా వద్దు..!
తనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రికి మాజీ సీఎం యడియూరప్ప లేఖ
బెంగళూరు: తనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేవలం మాజీ ముఖ్యమంత్రికి ఉండే సదుపాయాలు, భద్రత మాత్రమే తనకు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్న యడియూరప్ప.. సీఎంగా బసవరాజ్ బొమ్మైని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
‘ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సదుపాయాలను మాత్రమే నాకు కల్పించండి. కేబినెట్ హోదా కల్పిస్తూ జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోండి’ అని భాజపా సీనియర్ నేత యడియూరప్ప, కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఇక, కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న యడియూరప్ప జులై 26న తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం భాజపా అధిష్ఠానం సూచనల మేరకు శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన బసవరాజు బొమ్మై.. జులై 28న నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రికి యడియూరప్పకు కేబినెట్ ర్యాంకు కలిస్తూ శనివారం ఆదేశాలు జారీచేశారు. దీన్ని తిరస్కరించిన యడియూరప్ప.. కొత్త ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఇదిలాఉంటే, కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కొలువులో అమాత్యులకు ఆశించిన శాఖలు దక్కక పోవడంతో అసమ్మతి స్వరం ప్రతిధ్వనించింది. కేటాయించిన మంత్రి పదవులపై కొందరు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే యడియూరప్ప కూడా ముఖ్యమంత్రికి లేఖ రాయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
-
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ
-
జనం ఆస్తులతో.. జగనన్న భూమంతర్..!