Uddhav Thackeray: ‘శివసేన’పై స్పీకర్ నిర్ణయం.. మళ్లీ సుప్రీంకు ఉద్ధవ్ ఠాక్రే
Uddhav Thackeray: మహారాష్ట్ర సీఎం శిందే నేతృత్వంలోని వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్ ఇచ్చిన నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ముంబయి: శివసేన (Shiv Sena)లో రెండు చీలిక వర్గాల మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న పోరు ఇప్పుడప్పుడే ముగిసేలా కన్పించట్లేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఇటీవల ఆదేశాలు వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. తమ అనర్హత అభ్యర్థనను కొట్టివేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ఠాక్రే వర్గం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
శివసేన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఉద్ధవ్, ఏక్నాథ్ శిందే వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఇటీవల తన నిర్ణయాన్ని ప్రకటించారు. శిందే వెంటే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతూ శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లన్నింటినీ సభాపతి తిరస్కరించారు. శివసేన మొత్తం ఎమ్మెల్యేలు 57మంది కాగా వారిలో అత్యధికులు(37 మంది) శిందే వెంటే ఉన్నారని స్పీకర్ నిర్ధారించారు.
ఇదీ నేపథ్యం..
2022 జూన్లో ఏక్నాథ్ శిందే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేయడంతో శివసేనలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. భాజపాతో కలిసి శిందే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం వైరి వర్గంలోని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ శివసేనలోని రెండు వర్గాలు సభాపతికి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ పిటిషన్లపై 2024 జనవరి 10లోగా నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సభాపతి తన నిర్ణయాన్ని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!