TDP: కోనసీమ జిల్లాలో వైకాపాకు షాక్‌.. తెదేపా గూటికి వాసంశెట్టి సుభాష్‌

అమలాపురానికి చెందిన వైకాపా యువజన నాయుడు, శెట్టిబలిజ యాక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ తెదేపాలో చేరనున్నారు.

Published : 19 Jan 2024 16:49 IST

అమరావతి: కోనసీమ జిల్లాలో వైకాపాకు గట్టి షాక్‌ తగిలింది. అమలాపురానికి చెందిన వైకాపా యువజన నాయుడు, శెట్టిబలిజ యాక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ తెదేపాలో చేరనున్నారు. చంద్రబాబు సమక్షంలో శనివారం 5వేల మందితో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు.

వైకాపాకు రాజీనామా చేసినట్టు ఇప్పటికే సుభాష్‌ ప్రకటించారు. మంత్రి విశ్వరూప్, మరికొంత మంది సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెట్టారని.. అలాంటి వారికి టికెట్ ఇవ్వొద్దని అగ్రనాయకత్వానికి చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపారు. జిల్లా పేరు మార్పు విషయంలో జరిగిన అల్లర్ల కేసులో తమ సామాజిక వర్గాన్ని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందన్నారు. అమాయకులపై కేసులు ఎత్తివేయాలని కోరగా వైకాపా జిల్లా అధ్యక్షుడు, స్థానిక నేతలు అడ్డుపడ్డారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని