5G In America:భారత్-అమెరికా మధ్యఎయిరిండియా సర్వీసుల పునరుద్ధరణ
5జీ అంతర్జాల సేవల కారణంగా విమాన సేవలకు అంతరాయం కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో భారత్-అమెరికా
బోయింగ్ 777 విమానాలకు 5జీ సేవలతో ముప్పు లేదన్న ఎఫ్ఏఏ
దిల్లీ, దుబాయ్: 5జీ అంతర్జాల సేవల కారణంగా విమాన సేవలకు అంతరాయం కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య రద్దయిన సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య శుక్రవారం నుంచి అన్ని సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ‘5జీ’ ఆందోళనలతో బుధవారం రద్దు చేసిన 8 సర్వీసుల్లో ఆరింటిని (బోయింగ్ 777 విమానాలు) గురువారమే తిరిగి ప్రారంభించినట్లు వెల్లడించింది. బోయింగ్ సంస్థ నుంచి అందుకు అవసరమైన అనుమతులు వచ్చినట్లు పేర్కొంది. 5జీ అంతర్జాల సేవల కారణంగా విమానాల్లోని రేడియో అల్టీమీటర్లు ప్రభావితమవుతాయని.. ఫలితంగా ఇంజిన్, బ్రేకింగ్ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆందోళనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా విమానయాన నియంత్రణ సంస్థ- ‘ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ)’ గురువారం సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. బోయింగ్ 777 రకం సహా కొన్ని విమానాల అల్టీమీటర్లపై ‘5జీ’ ప్రభావం ఉండబోదని సష్టం చేసింది. వెంటనే- ఆ తరగతి విమానాలను అమెరికాకు నడిపేందుకు వీలుగా ఎయిరిండియాకు బోయింగ్ పచ్చజెండా ఊపింది. మరోవైపు- బ్రిటిష్ ఎయిర్వేస్, లుఫ్తాన్సా, ఎమిరేట్స్, జపాన్ ఎయిర్లైన్స్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు కూడా అమెరికాకు విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించాయి.
‘భారత్లో ఇబ్బంది ఉండదు’
ప్రతిపాదిత 5జీ సేవలతో భారత్లో విమాన సర్వీసులకు ఎలాంటి ముప్పూ ఉండబోదని ‘ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) - ఆసియా పసిఫిక్ టెలీకమ్యూనిటీ (ఏపీటీ) ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ గురువారం స్పష్టం చేసింది. దేశంలో ‘5జీ’ కోసం 3300-3670 మెగాహెర్ట్జ్ల ఫ్రీక్వెన్సీ బ్యాండ్ కేటాయిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా విమానాలు మాత్రం రేడియో అల్టీమీటర్ల కోసం 4200-4400 మెగాహెర్ట్జ్ల ఫ్రీక్వెన్సీని ఉపయోగించుకుంటాయని వెల్లడించింది. అమెరికాలో ‘5జీ’కి వినియోగించే బ్యాండ్ (3700-3980 మెగాహెర్ట్జ్).. అల్టీమీటర్ల ఫ్రీక్వెన్సీకి దగ్గరగా ఉండటం వల్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నట్లు పేర్కొంది.
అమెరికాలో 5జీ సేవలు షురూ
అగ్రరాజ్యం అమెరికాలో 5జీ అంతర్జాల సేవలను ఏటీ అండ్ టీ, వెరిజాన్ టెలికాం సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. విమానయాన సంస్థల అభ్యంతరాల నేపథ్యంలో.. కొన్ని విమానాశ్రయాల చుట్టూ మాత్రం ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..