Cricket News:‘నన్ను ఆ కారణంతోనే ఎంపిక చేయలేదా’
జులైలో టీమ్ఇండియా శ్రీలంకలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ గురువారం జట్టును ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో శిఖర్ ధావన్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బీసీసీఐ.
(photo:Saurashtra Cricket Twitter)
ఇంటర్నెట్ డెస్క్: జులైలో టీమ్ఇండియా శ్రీలంకలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ గురువారం జట్టును ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో శిఖర్ ధావన్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బీసీసీఐ. 20మంది ఆటగాళ్లతో పాటు ఐదుగురు నెట్ బౌలర్లను ఎంపిక చేసింది. ఈ బృందంలో చాలా మంది యువ క్రికెటర్లకు అవకాశం దక్కింది. అందులో దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, కృష్ణప్ప గౌతమ్, నితీశ్ రాణా, చేతన్ సకారియా వంటి ఆటగాళ్లు మొదటిసారి టీమ్ఇండియాకు ఎంపికయ్యారు. ఈ పర్యటనలో తనకు కూడా చోటు దక్కుతుందని భావించిన సౌరాష్ట్ర బ్యాట్స్మన్ షెల్డన్ జాక్సన్కు మాత్రం నిరాశే ఎదురైంది. ఈ ఆటగాడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. తాను ఎంపికకాకపోవడంపై జాక్సన్ స్పందించాడు.
‘ఇప్పుడు నాకు 34 ఏళ్లు. అయినప్పటికీ 22-23 ఏళ్ల వారికంటే దూకుడుగా ఆడతాను. ఆటకు వయసు అడ్డుగా కనిపిస్తే నేనేం చేయలేను. లేటు వయసులో జాతీయజట్టులోకి ఎంట్రీ లేదని ఆటకు సంబంధించిన ఏ చట్టాల్లో రాసి ఉంది? మీరు(సెలక్టర్లు) ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తున్నారు. రంజీ స్కోరుతోనా.. ఫిట్నెట్ను ఆధారంగా చేసుకోనా?. వరుసగా మూడు రంజీ సీజన్లలో 800-900 పరుగులు చేశానంటే ఫిట్గా ఉన్నాననే కదా అర్థం. అతని వయసు 30 కంటే ఎక్కువ.. అందుకే ఎంపిక కాలేదు. ఈ పదం చాలా సార్లు విన్నా’ అంటూ జాక్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ‘సూర్యుడు ఉదయిస్తాడు, నేను మళ్లీ ప్రయత్నిస్తా’ అంటూ ట్విటర్లో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని పోస్టు చేశాడు.
జాక్సన్ 75 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 5634 పరుగులు, 60 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 2096 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు,44 అర్ధసెంచరీలున్నాయి. జాక్సన్ వికెట్కీపర్ కూడా. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 4 మ్యాచ్ల్లో ఆడాడు. ఐపీఎల్ 14 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్