CSK vs KKR: తొమ్మిదేళ్ల క్రితం షాక్ ఇచ్చారు... ఇప్పుడు ఏం చేస్తారో?
IPL 2012 ఫైనల్లో ఏం జరిగింది.... కోల్కతా ఎలా గెలిచిందో తెలుసా...
(Photo: KKR Twitter)
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2021 (IPL 2021) ఆఖరి పోరు మరికాసేపట్లో మొదలుకానుంది. టైటిల్ కోసం చెన్నై సూపర్కింగ్స్ (Chennai Super kings), కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) తలపడబోతున్నాయి. అయితే ఈ ఫ్రాంచైజీ టోర్నీ ఫైనల్లో ఈ రెండు జట్లు రెండోసారి తలపడబోతున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం తొలిసారి జరిగిన పోరు అంటే 2012 ఐపీఎల్ ఫైనల్లో చెన్నై ( CSK)పై కోల్కతా ( KKR) ఘన విజయం సాధించింది. అసలు ఆ మ్యాచ్ ఎలా జరిగింది, ప్రత్యేకతలేంటో చూద్దామా!.
ఐపీఎల్లో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటనే సంగతి అందరికీ తెలిసిందే. ఎనిమిది సార్లు ఫైనల్కు చేరిన ఆ జట్టు మూడు సార్లు టైటిల్ సాధించి.. ఐదుసార్లు రన్నరప్గా నిలిచింది. ఇందులో ఒకసారి కోల్కతా నైట్ రైడర్స్ చేతిలోనే ఓటమిపాలవ్వడం గమనార్హం. 2010, 2011లో వరుసగా రెండేళ్లు కప్పు సాధించిన ధోనీసేన 2012లోనూ విజేతగా నిలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూసింది. కానీ, గంభీర్ నాయకత్వంలోని కోల్కతా జట్టు దానికి అడ్డుకట్ట వేసింది. చెన్నైను ఓడించి షాకిచ్చింది.
హస్సీ, రైనా మెరుపులు..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఓపెనర్లు మైఖేల్ హస్సీ (54; 43 బంతుల్లో 4x4, 2x6), మురళీ విజయ్ (42; 32 బంతుల్లో 4x4, 1x6) ధాటిగా ఆడి శుభారంభం చేశారు. తొలి వికెట్కు 87 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే విజయ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా (73; 38 బంతుల్లో 3x4, 5x6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హస్సీతో కలిసి రెండో వికెట్కు 73 పరుగులు జోడించాడు. అయితే, అర్ధశతకం తర్వాత ధాటిగా ఆడే క్రమంలోనే హస్సీ ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ ధోనీ (14 నాటౌట్; 9 బంతుల్లో 2x4) క్రీజులోకి వచ్చి రైనాకు చక్కటి సహకారం అందించాడు. చివరి బంతికి రైనా ఔటైనా కోల్కతా ముందు 191 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో మ్యాచ్ ఇక చెన్నై సొంతం అని ‘విజిల్ పోడు’ బ్యాచ్ ఫిక్స్ అయిపోయారు. ఈల వేసి గోల చేద్దాం అని సిద్ధమైపోయారు. కానీ అన్నీ అనుకున్నట్లు జరిగితే అది ఐపీఎల్ ఎందుకవుతుంది. చెన్నైకి కోల్కతా బిస్లా రూపంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అతనికి జాక్వెస్ కలిస్ తోడవడంతో మ్యాచ్ను మూట కట్టి... కప్పును గెలుచుకున్నారు.
బిస్లా, కలిస్ పిడుగులు..
(Photo: KKR Twitter)
2012 ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ అంటే గౌతమ్ గంభీరే అని చెప్పాలి. అంతలా జట్టు విజయాల్లో పాలుపంచుకున్నాడు. అయితే ఈ భారీ లక్ష్య ఛేదనలో గౌతమ్ గంభీర్ (2) విఫలమయ్యాడు. తొలి ఓవర్లోనే పెవిలియన్కు చేరాడు. మరో ఎండ్లో ఫైనల్ ముందు వరకు భీకర్ హిట్టర్ బ్రెండన్ మెక్కలమ్ ఉండేవాడు. అయితే ఫైనల్కు గంభీర్ అతనిని తీసుకోలేదు. దీంతో ఆదిలోనే చెన్నై మ్యాచ్పై పట్టుసాధించేలా కనిపించింది. అయితే ఊహించనవి విధంగా గంభీర్ మన్విందర్ బిస్లాపై నమ్మకం ఉంచి, అతనిని తీసుకున్నాడు. చాలా రోజులగా డగౌట్కే పరిమితమయ్యాడు, అతనేం ఆడతాడులే అని అందరూ అనుకున్నారు ఆ రోజు. కానీ బిస్లా అలా అనుకోలేదు. అవకాశాన్ని రెండు చేతులా అందిపుచుకున్నాడు. జట్టుకు ఒంటి చేత్తో కప్ అందించాడు. బిస్లా (89; 48 బంతుల్లో 8x4, 5x6), జాక్వెస్ కలిస్ (69; 49 బంతుల్లో 7x4, 1x6) దంచికొట్టారు. చెన్నై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఫోర్లు, సిక్సర్లతో పిడుగుల వర్షం కురిపించారు. దీంతో ఇంకేముంది కప్ కోల్కతాదే అనుకున్నారంతా. ఫ్రాంచైజీ ఓనర్ షారుఖ్ ఖాన్ కూడా ఎగిరి గంతేసినంత పని చేశాడు.
ముందు చెప్పినట్లు అన్నీ అనుకున్నట్లు జరిగితే అది ఐపీఎల్ కాదు కదా. బిస్లా శతకానికి చేరువైన వేళ మోర్కెల్ బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో చెన్నై బౌలర్లు ఓవైపు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ, మరోవైపు కీలక సమయాల్లో వికెట్లు తీశారు. అనంతరం లక్ష్మీరతన్ శుక్లా (3), యూసుఫ్ పఠాన్ (1) సైతం విఫలమయ్యారు. ఇక కలిస్ పోరాడినా విజయానికి చేరువలో ఔటయ్యాడు. దీంతో కోల్కతా విజయానికి 8 బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఖరి ఓవర్లో 9 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఎలాంటి డ్రామాకు ఆస్కారం ఇవ్వకుండా మనోజ్ తివారి (9*) రెండు ఫోర్లు బాది జట్టుకు విజయాన్ని, ట్రోఫీని అందించాడు.
బిస్లా ఏం చేస్తున్నాడో...
మొదట్లో చెప్పుకున్నట్లు బిస్లా... ఫైనల్ మ్యాచ్కు జట్టులోకి రావడం చాలా మందికి రుచించలేదు. ఆ సమయంలో ట్విటర్లో పోల్ పెడితే... బిస్లా రావడం జట్టుకు ఉపయోగకరంగా ఉండదు అంటూ 75 శాతం మంది అభిప్రాయం చెప్పారట. కానీ అదే బిస్లా జట్టుకు విజయాన్ని అందించాడు. అన్నట్లు, అప్పటివరకు టోర్నీలో బిస్లా మెరిపించిన మెరుపులు ఒకటో, రెండో. కానీ అవసరమైన సమయంలో గట్టిగా మెరిశాడు. ఆ తర్వాతి ఏడాది కూడా కోల్కతాకే ఆడిన బిస్లా 14 మ్యాచ్ల్లో 255 పరుగులు చేశాడు. 2015లో కోల్కతా నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు డ్రాఫ్ట్ అయ్యాడు. ఆ తర్వాత బిస్లాను ఏ జట్టూ తీసుకోలేదు. అయితే ఆఖరిగా 2020లో లంక ప్రీమియర్ లీగ్లో కొలంబో కింగ్స్ తరఫున ఆడాడు.
ఈ మ్యాచ్ను ప్రేరణగా తీసుకుంటే..
(Photo: KKR Twitter)
నాటి మ్యాచ్ను కోల్కతా ఆటగాళ్లు నేడు ప్రేరణగా తీసుకుంటే మరోసారి చెన్నైకి షాకిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈసారి కూడా కోల్కతా.. చెన్నైకి దీటుగా కనిపిస్తోంది. బ్యాటింగ్లో ఓపెనర్గా చెన్నైకి రుతురాజ్ ఉంటే ఇక్కడ వెంకటేశ్ అయ్యర్ మెరుస్తున్నాడు. తర్వాత ధోనీసేనలో డుప్లెసిస్, ఉతప్ప, అంబటి రాయుడు లాంటి బ్యాట్స్మెన్ రాణిస్తుంటే.. మోర్గాన్ టీమ్లో శుభ్మన్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి ఉన్నారు. అటు చెన్నై బౌలింగ్లో దీపక్ చాహర్, బ్రావో, శార్దూల్ ఠాకూర్ లాంటి పేసర్లు ఉండగా.. కోల్కతాలో సునీల్ నరైన్, షకిబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తి లాంటి స్పిన్నర్లు ఉన్నారు. దీంతో ఎలా చూసినా రెండు జట్లూ సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. చివరగా ఇరు జట్లలోని కెప్టెన్లు రాణించడమే కీలకం కానుంది. ఇటు చెన్నైలో ధోనీ మెరిసినా, అటు కోల్కతాలో మోర్గాన్ బ్యాట్ ఝుళిపించినా ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ ఎంత రసవత్తరంగా సాగుతుందో వేచిచూడాలి.
నాటి మ్యాచ్ హైలైట్స్ వీక్షించండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. జట్టు సభ్యుల ఎంపికపై వస్తోన్న విమర్శలు, సందేహాలపై వివరణ ఇచ్చారు. -
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
ధోనీని రనౌట్ చేసిన వికెట్ కీపర్ జితేశ్ శర్మపై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. అతడి ఫ్యాన్స్ విమర్శలు గుప్పించారు. -
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆట తీరుపై నెట్టింట విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా స్ట్రైక్రేట్ ఉండటం లేదని కొందరు మాజీలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వాటిపై ఏబీ డివిలియర్స్ స్పందించాడు. -
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
ఈ ఐపీఎల్ సీజన్లో తొలిసారి ధోనీ ఔటయ్యాడు. అయితే, అతడు చివరి ఓవర్లో సింగిల్ను తిరస్కరించడంపై నెట్టింట చర్చకు తెర లేచింది. -
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్