జాన్‌సినా.. అందుకే ఐశ్వర్య ఫొటో పెట్టావా?

ప్రముఖ డబ్ల్యూడబ్యూఈ రెజ్లర్‌ జాన్‌సినా ఇన్‌స్టాగ్రామ్‌లో బాలీవుడ్‌ బ్యూటి ఐశ్వరాయ్‌ ఫొటో పంచుకున్నాడు. గతవారం అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబ సభ్యులు కరోనా వైరస్‌ బారిన పడిన సంగతి తెలిసిందే...

Published : 21 Jul 2020 02:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ డబ్ల్యూడబ్యూఈ రెజ్లర్‌ జాన్‌సినా ఇన్‌స్టాగ్రామ్‌లో బాలీవుడ్‌ బ్యూటి ఐశ్వరాయ్‌ ఫొటో పంచుకున్నాడు. గతవారం అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబ సభ్యులు కరోనా వైరస్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. బిగ్‌బీతో పాటు, కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌, కోడలు ఐశ్వర్య రాయ్‌, మనవరాలు ఆరాధ్య కూడా మహమ్మారి బారిన పడ్డారు. మరోవైపు అమితాబ్‌ భార్య జయా బచ్చన్‌ మాత్రం దాని నుంచి తప్పించుకున్నారు. తొలుత బిగ్‌బీ, అభిషేక్‌ నానావతి ఆస్పత్రిలో చేరగా అప్పుడు కూడా జాన్‌సినా వారి ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు.

అలాగే శుక్రవారం వరకు హోమ్‌ క్వారెంటైన్‌లో ఉన్న ఐశ్వర్య శనివారం ఉన్నపళంగా ఆస్పత్రిలో చేరారు. దీంతో వెంటనే జాన్‌సినా ఆమె ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలా ఉండగా, ఈ రెజ్లర్‌ ఇటీవల బాలీవుడ్‌ నటుల ఫొటోలు విరివిగా పోస్టు చేస్తున్నాడు. ప్రముఖ నటులు రిషీ కపూర్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణించినప్పుడు కూడా వారి ఫొటోలను పోస్టుచేశాడు. దీంతో అతడు బాలీవుడ్‌ స్టార్ల విశేషాలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని