వైద్యుల మాటలను కాదనలేం: ఫించ్
భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో రవీంద్ర జడేజాకు బదులు యుజువేంద్ర చాహల్ను కంకషన్ సబ్స్టిట్యూట్గా ఆడించడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్పందించాడు...
ఇంటర్నెట్డెస్క్: భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో రవీంద్ర జడేజాకు బదులు యుజువేంద్ర చాహల్ను కంకషన్ సబ్స్టిట్యూట్గా ఆడించడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్పందించాడు. వైద్యుల మాటలను కాదనలేమని అన్నాడు. అసలేం జరిగిందంటే.. తొలి ఇన్నింగ్స్లో జడేజా(44*) బ్యాటింగ్ చేస్తుండగా ఆఖరి ఓవర్లో తలకు గాయమైన సంగతి తెలిసిందే. ఒక బంతి హెల్మెట్కు బలంగా తాకడంతో వైద్యుల సూచన మేరకు టీమ్ఇండియా అతడిని రెండో ఇన్నింగ్స్లో కొనసాగించలేదు. దీంతో చాహల్ను కంకషన్ సబ్స్టిట్యూట్గా తీసుకుంది. అతడు 3/25 అత్యుత్తమ ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అయితే, చాహల్ కంకషన్ సబ్స్టిట్యూట్గా రావడంపై ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ మ్యాచ్ జరుగుతుండగానే అభ్యంతరం వ్యక్తం చేశాడు. మ్యాచ్ రిఫరీతో వాగ్వాధానికి దిగాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్.. జడేజాకు తగిలిన గాయంపై వైద్యుల మాటలను కాదనలేమని చెప్పాడు. ‘కంకషన్ కారణంగా టీమ్ఇండియా ఫిజియో జడేజాను ఆడనివ్వలేదు. వైద్య నిపుణుల అభిప్రాయాలను ఎదురించలేం. అయితే, టీమ్ఇండియా బ్యాటింగ్ చేస్తుండగా ఆఖరి ఓవర్లలో మేం ధారాళంగా పరుగులిచ్చాం. ఆపై ఛేదనలోనూ చివరి ఓవర్లలో ధాటిగా ఆడి బౌండరీ సాధించలేకపోయాం. అదే మా ఓటమికి కారణం’ అని ఫించ్ వివరించాడు. ఇక ఈ మ్యాచ్లో అనూహ్యంగా అవకాశం వచ్చి తన బౌలింగ్తో సత్తా చాటిన చాహల్ మాట్లాడుతూ.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభానికి పది నిమిషాల ముందే తాను సబ్స్టిట్యూట్గా ఆడుతున్నట్లు తెలిసిందని చెప్పాడు. ఇప్పటికే పలు మ్యాచ్లు ఆడినందున మానసికంగా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అలాగే ఈ మ్యాచ్లో ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా బౌలింగ్ చేసినట్టే తాను చేయాలనుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ పిచ్పై 150-160 స్కోర్ మంచిదని, తన ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేశానని యూజీ వివరించాడు. కాగా, రెండో టీ20 ఆదివారం సిడ్నీ వేదికగా జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..