MS Dhoni: ఆసీస్-విండీస్ మ్యాచ్ కామెంట్రీలో ధోనీ బ్యాట్పై చర్చ!
ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఏం చేసినా నెట్టింట చర్చకు దారి తీస్తుంది. ప్రాక్టీస్ సందర్భంగా వాడిన బ్యాట్ కూడా వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే నెలలో ఐపీఎల్ 2024 ఎడిషన్ (IPL 2024) ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. ఆ ఫొటోలు వైరల్గా మారాయి. అందులో వాడిన బ్యాట్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా- వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ సందర్భంగానూ కామెంట్రీ బాక్స్లో వ్యాఖ్యాతలు మాట్లాడుకోవడం విశేషం. ఆసీస్ మాజీ క్రికెటర్లు గిల్క్రిస్ట్, మైకెల్ హస్సీ ఐపీఎల్ గురించి చర్చించారు. హస్సీ సీఎస్కే తరఫున ఆడిన విషయం తెలిసిందే.
‘‘ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి పది రోజులు ముందే భారత్కు వెళ్తా. మార్చి రెండో వారం నుంచి ఉండొచ్చని తెలుస్తోంది. దాని కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లు ఆ టోర్నీలో ఆడుతున్నారు. భారత్ నుంచి యువ క్రికెటర్లకూ మంచి అవకాశం. మ్యాచ్లను చూసేందుకు ప్రేక్షకులు భారీగా వస్తారు. వారు చేసే సందడి అద్భుతంగా ఉంటుంది. ఎంఎస్ ధోనీ ఈ ఎడిషన్ కోసం సిద్ధమవుతున్నాడు. నెట్స్లో ఇప్పటికే సాధన మొదలు పెట్టాడు’’ అని హస్సీ వ్యాఖ్యానించాడు.
ఆ స్టిక్కర్ను చూశా: గిల్క్రిస్ట్
‘‘నెట్స్లో ఎంఎస్ ధోనీ సాధన చేయడం చూశా. అతడు వాడిన కొత్త బ్యాట్పై స్టిక్కర్లను గమనించా. స్థానికంగా ఉండే స్పోర్ట్స్ స్టోర్కు సంబంధించినది. ధోనీ పాఠశాల సహచరుడు ఆ షాప్ను నిర్వహిస్తున్నాడు. అమ్మకాలను పెంచేందుకు తనవంతు సాయంగా ధోనీ ఆ స్టిక్కర్లను తన వాడే బ్యాట్పై అతికించాడు’’ అని గిల్క్రిస్ట్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!