Ajinkya Rahane: మళ్లీ కౌంటీల్లో ఆడనున్న అజింక్య రహానె.. లీసెస్టర్షైర్ తరఫున బరిలోకి
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో టెస్టుల్లోకి పునరాగమనం చేసిన భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానె (Ajinkya Rahane) త్వరలో కౌంటీల్లో ఆడనున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో టెస్టుల్లోకి పునరాగమనం చేసిన భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానె (Ajinkya Rahane) త్వరలో కౌంటీల్లో ఆడనున్నాడు. జులైలో వెస్టిండీస్తో భారత్ రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్లు ముగిసిన తర్వాత రహానె ఇంగ్లాండ్ వెళ్లి లీసెస్టర్షైర్ (Leicestershire) తరఫున ఆడనున్నాడు. రహానె జనవరిలో లీసెస్టర్షైర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం ఐపీఎల్ ముగిసిన వెంటనే రహానె ఇంగ్లాండ్ వెళ్లి ఎనిమిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, రాయల్ లండన్ కప్ (50 ఓవర్ల దేశవాళీ టోర్నమెంట్)లో మొత్తం మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ, టెస్టుల్లోకి పునరాగమనం చేయడంతో యూకేకు వెళ్లలేదు.
‘‘వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ ముగియగానే రహానె ఇంగ్లాండ్ బయలుదేరుతాడు. లీసెస్టర్షైర్ జట్టుతో చేరి మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడు. ఆగస్టులో జరిగే రాయల్ లండన్ కప్లో ఆడతాడు. భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడు భాగమయ్యే అవకాశాలు లేనందున సెప్టెంబరులో నాలుగు కౌంటీ మ్యాచ్లు ఆడే ఛాన్స్ ఉంది’’ అని బీసీసీఐ వర్గాలు పీటీఐకి తెలిపాయి. రహానె కౌంటీల్లో ఆడటం ఇది రెండోసారి. 2019లో హాంప్షైర్ తరఫున ఆడాడు.ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్లో రహానె 89 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 5,000 పరుగుల మైలురాయిని (83 టెస్టుల్లో) దాటాడు. ఈ నెలాఖరులో టీమ్ఇండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. జులైలో విండీస్తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జులై 12న టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!