ODI World Cup : తొలి మ్యాచ్లోనే పెద్ద జట్టుతో ఆడటం.. ఎప్పుడూ ప్రయోజనకరమే : సునీల్ గావస్కర్
ప్రపంచకప్లో తొలి మ్యాచ్లోనే పెద్ద టీమ్తో తలపడం ఏ జట్టుకైనా ప్రయోజకరంగా ఉంటుందని మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) వివరించాడు.
ఇంటర్నెట్ డెస్క్ : ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్(ODI World Cup 2023) కోసం ఐసీసీ(ICC) ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మెగాటోర్నీకి ఇంకా మూడు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆయా జట్లు సమాయత్తమవుతున్నాయి. పిచ్ పరిస్థితులేంటి.. ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో షెడ్యూల్పై మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) స్పందించాడు.
గత ప్రపంచకప్లో ఫైనల్కు చేరిన ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్(ENG vs NZ)తో అక్టోబర్ 5న ఈ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇక టీమ్ఇండియా చెన్నై వేదికగా 8న ఆస్ట్రేలియా(IND vs AUS)తో మ్యాచ్తో తన ప్రపంచకప్ పోరును ప్రారంభించనుంది. అయితే.. తొలి మ్యాచ్లోనే పెద్ద జట్టుతో తలపడటం రోహిత్ సేనకు అడ్వాంటేజ్గా మారుతుందని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ ఆతిథ్య జట్టు తొలి మ్యాచ్లోనే ఓటమిపాలైనప్పటికీ.. తప్పులు సరిదిద్దుకునే అవకాశమూ ఉంటుందని పేర్కొన్నాడు.
‘ఆఖర్లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో.. ఆస్ట్రేలియాలాంటి పెద్ద జట్టుతో తలపడటం ఎంతో కష్టం. అందుకే అలాంటి జట్టుతో తొలి మ్యాచ్లోనే తలపడితే మన జట్టుకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నేను భావిస్తున్నా. ఒకవేళ అనుకున్న ఫలితం రాకున్నా ఫర్వాలేదు. తర్వాత అవకాశాలు ఉంటాయి. బలహీనమైన జట్టుతో మీరు ఆడొచ్చు. అప్పుడు ఏం చేయాలో.. ఎంత మార్జిన్తో గెలవాలో మీకు తెలుస్తుంది’ అని సన్నీ వివరించాడు. ఇక పెద్ద టీమ్పై గెలిస్తే.. ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపాడు.
‘1983 ప్రపంచకప్లో మేం తొలి మ్యాచ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్తో తలపడ్డాం. గెలిచాం. అప్పటి వరకూ మా ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేకపోవడంతో ఈ విజయం మాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది’ అని గావస్కర్ వెల్లడించాడు.
ఈ వన్డే ప్రపంచకప్లో భారత్.. తన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్(IND vs PAK)తో అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న తలపడనున్న విషయం తెలిసిందే. నవంబర్ 19న ఇదే అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.