Icc World Cup 2023: చెదిరిన స్వప్నం.. ఆసీస్కే పట్టం
ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియాన్ని నీలి జెర్సీలతో నింపేసిన లక్షా ముప్ఫైవేల మంది ప్రేక్షకులు.. టీవీల ముందు కూర్చున్న కోట్లమంది నిశ్శబ్దంగా నిట్టూర్చిన సందర్బాలు ఎన్నెన్నో!
ఆస్ట్రేలియాకు ఆరోసారి ప్రపంచకప్
రోహిత్సేన జైత్రయాత్రకు ఫైనల్లో బ్రేక్
ఆటల్లో భారీ సంఖ్యలో ఉన్న అభిమానగణాన్ని నిశ్శబ్దపరచడం కంటే సంతృప్తినిచ్చే విషయం మరొకటి లేదు. మా లక్ష్యం అదే’’
భారత్తో వన్డే ప్రపంచకప్ ఫైనల్ ముంగిట ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్య ఇది.
ఆదివారం నరేంద్ర మోదీ (Narendra Modi Stadium) స్టేడియాన్ని నీలి జెర్సీలతో నింపేసిన లక్షా ముప్ఫైవేల మంది ప్రేక్షకులు.. టీవీల ముందు కూర్చున్న కోట్లమంది నిశ్శబ్దంగా నిట్టూర్చిన సందర్బాలు ఎన్నెన్నో! ఆరంభంలోనే శుభ్మన్ (Shubman Gill) ఔటైపోయినపుడు నిశ్శబ్దం.. చెలరేగి ఆడుతున్న రోహిత్ శర్మ (Rohit Sharma) పెవిలియన్ చేరినపుడు నిశ్శబ్దం.. శ్రేయస్ (Shreyas iyer) ఇలా వచ్చి అలా వెళ్లిపోయినపుడు నిశ్శబ్దం.. నిలకడగా ఆడుతున్న కోహ్లి (Virat Kohli) వెనుదిరిగినపుడు ఇంకా ఇంకా నిశ్శబ్దం.. ఆస్ట్రేలియా (Australia) ఇన్నింగ్స్ సాగుతున్నపుడూ బంతి బౌండరీకి చేరిన ప్రతిసారీ నిశ్శబ్దమే! ఇక ఆ గెలుపు పరుగు పూర్తయిన క్షణాన భరించలేని నిశ్శబ్దం! మన ప్రయాణం పడుతూ లేస్తూ సాగి ఉంటే.. అదృష్టం వల్లే మన జట్టు ముందంజ వేసి ఉంటే.. జట్టులో ఏవైనా లోపాలు కనిపించి ఉంటే.. ఆశలు, అంచనాలు తగ్గించుకునేవాళ్లం! కానీ ఎన్నడూ చూడని ఆధిపత్యం.. ఎవ్వరు ఎదురొచ్చినా తగ్గేదేలేదన్నట్లుగా సాగిపోయిన రోహిత్సేనను చూశాక.. ప్రపంచకప్పుకి భారత్ మూడో ముద్దు ఇచ్చేయబోతుందనే అనుకున్నాం. కానీ ఊహించనిది జరిగింది.. కల చెదిరింది.. కప్పు చేజారింది.. అందుకే ఈ ఓటమి జీర్ణించుకోలేనిది.. బ్యాటుతో అదరగొట్టు.. బంతితో పడగొట్టు.. ఈ ప్రపంచకప్ అంతా టీమ్ ఇండియాది ఇదే మంత్రం! కానీ ఫైనల్లో మాత్రం రోహిత్ సేన బ్యాటుతో ఆశించిన స్థాయిలో కొట్టలేదు. బంతితో పడగొట్టనూలేదు. అద్భుత బౌలింగ్.. మెరుపు వేగంతో కూడిన ఫీల్డింగ్.. సమయోచిత బ్యాటింగ్.. వెరసి ఆధిపత్యం మొత్తం ఆస్ట్రేలియాదే. ఆతిథ్య జట్టు ప్రణాళికలన్నింటినీ ఛిద్రం చేస్తూ కంగారూలు.. ప్రపంచకప్ను ఎగరేసుకుపోయారు.
6
ఆస్ట్రేలియా సాధించిన వన్డే ప్రపంచకప్ టైటిళ్లు. 1987, 1999, 2003, 2007, 2015లోనూ ఆ జట్టు విజేతగా నిలిచింది.
2
ప్రపంచకప్ ఫైనల్లో టీమ్ఇండియా ఓడిన సందర్భాలు. 2003లో తుదిపోరులోనూ ఆస్ట్రేలియా చేతిలోనే పరాజయం పాలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు