IPL 2024 Auction: చెన్నై సూపర్ కింగ్స్‌లో సిరిసిల్ల కుర్రాడు

ఐపీఎల్-2024 సీజన్‌ కోసం జరిగిన వేలంలో తెలంగాణకు చెందిన కుర్రాడిని చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings) కొనుగోలు చేసింది.

Updated : 20 Dec 2023 04:50 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-2024 సీజన్‌ కోసం జరిగిన వేలంలో తెలంగాణకు చెందిన కుర్రాడిని చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings) కొనుగోలు చేసింది. హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ (HCA) తరఫున ఆడుతున్న అరవెల్లి అవనీశ్ రావు (Avanish Rao Aravelly)ని సీఎస్కే కనీస ధర రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ 18 ఏళ్ల హర్డ్ హిట్టర్, వికెట్ కీపర్‌ని వేలం చివరలో చెన్నై దక్కించుకుంది. అవనీశ్‌ది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం. జనవరి 19న దక్షిణాఫ్రికాలో ఆరంభమయ్యే అండర్-19 ప్రపంచకప్‌ జట్టుకు కూడా అవనీశ్ రావు ఎంపికయ్యాడు. 18 ఏళ్ల అవనీశ్‌ వికెట్‌కీపర్‌, బ్యాటర్‌. ఈ ఏడాది నవంబర్‌లో అండర్‌-19 నాలుగు జట్ల టోర్నీలో భారత్‌-ఏ తరఫున ఆడిన అవనీశ్ భారత్‌-బిపై 163 పరుగులతో అదరగొట్టాడు. అదే నెలలో విజయ్‌హజారె ట్రోఫీలో హైదరాబాద్‌ తరఫున సర్వీసెస్‌పై లిస్ట్‌-ఏ అరంగేట్రం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని