Team India: ‘ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్ను టెస్టుల్లో కోచ్గా కొనసాగించాలి’
వన్డే ప్రపంచకప్తో కోచ్గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగుస్తుంది. వర్డల్ కప్ తర్వాత ద్రవిడ్ను టెస్టుల్లో కోచ్గా కొనసాగాలని బీసీసీఐ (BCCI) విజ్ఞప్తి చేయాలని బోర్డు మాజీ అధికారు ఒకరు అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ (World Cup 2023)నకు ఈ సారి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19న జరిగే ఫైనల్తో ముగియనుంది. వన్డే ప్రపంచకప్తో కోచ్గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగుస్తుంది. ఈ టోర్నీ స్వదేశంలో జరుగుతుండటంతో భారత్ (Team India)పై భారీ అంచనాలున్నాయి. ఒకవేళ టీమ్ఇండియా రాణించకపోతే.. విఫలమైన ఆటగాళ్లపై వేటువేయడంతోపాటు కొత్త కోచ్ను ఎంపిక చేసే అవకాశముంది. వీటన్నింటిని పట్టించుకోకుండా మరోసారి కోచ్గా పనిచేయాలని బీసీసీఐ కోరితే అప్పుడు ద్రవిడ్ స్పందన ఎలా ఉంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది. అతడు సానుకూలంగా ఉంటే ప్రపంచ కప్ తర్వాత సౌతాఫ్రికా టూర్, స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగే టెస్టు సిరీస్లకు కోచ్గా కొనసాగొచ్చు. ఈ అంశంపై బీసీసీఐ మాజీ అధికారి ఒకరు స్పందించారు.
‘‘టీమ్ఇండియా ప్రపంచకప్ టైటిల్ను అందుకుంటే కోచ్గా ద్రవిడ్ తన ప్రస్థానాన్ని ఉన్నతంగా ముగించాలనుకునే ఉద్దేశంతో కాంట్రాక్ట్ను పునరుద్ధరించుకోకపోవచ్చు. కానీ, నా అభిప్రాయం ఏంటంటే ప్రపంచ కప్ తర్వాత బీసీసీఐ వేర్వేరు ఫార్మాట్లకు ప్రత్యేక కోచ్లను నియమించడంపై ఆలోచించాలి. ద్రవిడ్ను టెస్టుల్లో కోచ్గా కొనసాగాలని కోరాలి’’ అని సదరు మాజీ అధికారి బీసీసీఐకి సూచించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్కు వేర్వేరు కోచ్లు ఉన్నారు. వన్డేలకు మాథ్యూ మోట్, టెస్టులకు బ్రెండన్ మెక్కల్లమ్ కోచ్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టు ఆసియా కప్పై దృష్టిపెట్టింది. సూపర్-4కు చేరుకున్న రోహిత్ సేన.. సెప్టెంబరు 10న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో మరోసారి తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
-
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ