ఐపీఎల్: ‘ఓపెనర్లుగా రోహిత్-రితికా?’
ఐపీఎల్ పదమూడో సీజన్ ప్రారంభం కాకముందే ‘ఐపీఎల్ సందడి’ మొదలైంది. ప్రత్యర్థులకు సరదా కవ్వింపులు, సహచరు ఆటగాళ్ల పోస్టుల్లో ఫన్నీ కామెంట్లతో ప్రాంఛైజీలు, ఆటగాళ్లు అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా మంగళవారం కేకేఆర్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఆటగాళ్లు మహమ్మారి
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్ పదమూడో సీజన్ ప్రారంభం కాకముందే ‘ సందడి’ మొదలైంది. ప్రత్యర్థులకు సరదా కవ్వింపులు, సహచర ఆటగాళ్ల పోస్టుల్లో ఫన్నీ కామెంట్లతో ప్రాంఛైజీలు, ఆటగాళ్లు అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా మంగళవారం కేకేఆర్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఆటగాళ్లు మహమ్మారి కరోనా బారిన పడకుండా జట్టు యాజమాన్యాలు ‘బయోబబుల్’ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నాయి. అయితే కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం తమకి ఎనిమిదేళ్ల క్రితమే బయోబబుల్ అనుభవం ఉందని సరదాగా ట్వీట్ చేసింది. ఐపీఎల్-2012లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఆరంభ మ్యాచ్లో ప్లాస్టిక్ బబుల్లో ఉన్న కోల్కతా ఆటగాళ్ల చిత్రాన్ని పోస్ట్ చేసింది. ‘దీన్ని ఎవరైనా బయోసెక్యుర్ బబుల్ అంటారా? మాకు దీనిలో ఎంతో అనుభవం ఉంది’ అని వ్యాఖ్య జత చేసింది.
మరోవైపు ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ చాహల్ సరదాగా కామెంట్ చేశాడు. తన భార్య రితికాతో వ్యాయామం చేస్తున్న వీడియోను రోహిత్ ఇన్స్టాలో మంగళవారం అభిమానులతో పంచుకున్నాడు. దీనికి చాహల్ ‘ఐపీఎల్లో ఈ సారి వదినతో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగుతున్నావా?’ అని ఫన్నీగా కామెంట్ చేశాడు. పోస్ట్ చేసిన కొద్దిక్షణాల్లోనే ఈ వీడియోను లక్షల మంది వీక్షించడం విశేషం. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేసర్ మహమ్మద్ షమి క్వారంటైన్లో కసరత్తులతో శ్రమిస్తున్నాడు. అతడు వ్యాయామం చేసిన వీడియోను పంజాబ్ జట్టు తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.