భూచోడు మన భూములపై కన్నేశాడు!
‘జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూమికి రికార్డులు, పాసు పుస్తకం, అడంగల్ ఉండవు.. మీ ఆస్తిపత్రాలను జగన్ లాక్కుని మీకు జిరాక్సు కాపీలు ఇస్తారు.
జగన్ మళ్లీ వస్తే మీ ఆస్తిపత్రాలు లాక్కుంటారు
మేం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం
వైకాపా ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తిన చంద్రబాబు
నేను సంక్షేమం చేసేవాడినే కానీ.. తీసేసేవాడిని కాదు
నూజివీడు, దర్శి, కాకినాడ ప్రజాగళం సభల్లో చంద్రబాబు ధ్వజం
ఈనాడు, ఏలూరు, ఒంగోలు, కాకినాడ: ‘జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూమికి రికార్డులు, పాసు పుస్తకం, అడంగల్ ఉండవు.. మీ ఆస్తిపత్రాలను జగన్ లాక్కుని మీకు జిరాక్సు కాపీలు ఇస్తారు. అసలు పత్రాలన్నీ అమెరికాలోని క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ అనే తన బినామీ కంపెనీ నిర్వహిస్తుందంటున్నారు.. జగన్ అనే భూచోడు మన భూములపై కన్నేశాడు.. మీ జుట్టును ఆయన చేతిలో పెట్టుకోవాలని చూస్తున్నారు. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తెస్తున్నారు. దాన్ని చెత్తబుట్టలో వేయండి.. మేం అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపై.. రెండో సంతకం ఈ నల్లచట్టాన్ని రద్దు చేసేందుకే చేస్తా’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా నూజివీడు, ప్రకాశం జిల్లా దర్శి, కాకినాడ నగరంలో శనివారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన ప్రసంగించారు. అంతకుముందు కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణ నియోజకవర్గాల్లో రోడ్షో చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ.. ‘వైకాపా ప్రభుత్వం ఇస్తున్న పట్టాదారు పాసు పుస్తకంపై ఎవరి ఫొటో ఉందో చూశారా? మీ తాతలు, తండ్రులిచ్చిన భూముల పత్రాలపై జగన్ ఫొటో ఉండటమేంటి? మీ ఆస్తులపై ఆయన పెత్తనమేంటి’ అంటూ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో ప్రతులను, సీఎం జగన్ చిత్రంతో ఉన్న పాసు పుస్తకాల్ని చించటంతో ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. చప్పట్లు కొడుతూ, ఈలలు వేసి స్వాగతించారు.
‘జగన్ నవరత్నాలంటూ ప్రజలను నమ్మించి.. ఆ పేరుతో తొమ్మిది మాఫియా సామ్రాజ్యాలు నెలకొల్పారు. వాటిలో మొదటిది ఇసుక, రెండు మద్యం, మూడు భూఅక్రమాలు, నాలుగు మైనింగ్, అయిదు హత్యలు, ఆరు ప్రజల ఆస్తుల కబ్జా, ఏడు ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్, ఎనిమిది దాడులు, కేసులు, తొమ్మిది శవ రాజకీయాలు’ అని ఎద్దేవా చేశారు. ‘జగన్ ప్రతి ఎన్నికలకూ శవ రాజకీయాలు చేస్తున్నారు. గతంలో బాబాయి హత్య, కోడికత్తి డ్రామాలాడారు. ఈసారి గులకరాయి, ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీ చేయకుండా వృద్ధులను చంపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. జగన్ ఓ మాయల మాంత్రికుడు. అంతా జాగ్రత్తగా ఉండండి. మే 13న తెదేపా కూటమి అభ్యర్థులకు ఓటేయండి. జూన్ 4న నరకాసుర వధతో రాష్ట్రంలో దీపావళి చేసుకుందాం’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
‘వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్రెడ్డిని జగన్ తన పక్కన పెట్టుకుని అమాయకుడు, పిల్లోడు అంటున్నారు. పిల్లోడైతే బడికి పంపకుండా పార్లమెంట్కు ఎందుకు’ అని ఎద్దేవా చేశారు. నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో విలీనం చేస్తానని, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
వైకాపా నాయకులు అర్చకుల్నీ కొడుతున్నారు
‘విశాఖలోనే రూ.40 వేల కోట్ల విలువైన ఆస్తుల్ని కొట్టేసిన దుర్మార్గుడు జగన్. కాకినాడ పోర్టు అసలు యజమాని దగ్గర ఉందా..? 40-45 ఏళ్లు కష్టపడి సంపాదించిన ఆ ఆస్తిని మెడపై కత్తిపెట్టి రాయించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూ యజమానుల ఫొటోతో పాసుపుస్తకాలు ఇచ్చే బాధ్యత నాది. వైకాపా ప్రభుత్వ హయాంలో దాడులకు గురైన ప్రతి దేవాలయంపైనా విచారణ జరిపిస్తాం. రాముడి తల ధ్వంసం చేసిన వారిని, తితిదేను అపవిత్రం చేసిన వారిని శిక్షిస్తాం. వైకాపా నాయకులు గుడిలో అర్చకుల్ని, మసీదులో ఇమాముల్ని కొడుతున్నారు. మేం వచ్చిన తర్వాత.. వాళ్లను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా’ అని చంద్రబాబు హెచ్చరించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, ఆయన తండ్రి, తమ్ముడు 15 వేల కోట్ల విలువైన బియ్యాన్ని పోర్టు ద్వారా అక్రమంగా విదేశాలకు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంపద సృష్టిస్తాం.. అందరికీ పంచుతాం
‘జగన్ ప్రజలకు రూ.10 ఇచ్చి.. రూ.100 దోపిడీ చేస్తున్నారు. మా మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా సంపద సృష్టించి.. పేదలకు పంచుతాం. నేను సంక్షేమం చేసేవాడినే కానీ.. తీసేవాడిని కాదు.. రూ.200 ఉన్న పింఛన్ రూ.2 వేలు చేసింది నేనే. మేం అధికారంలోకి రాగానే రూ.4 వేలకు పెంచి ఏప్రిల్ నుంచి అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఆదుకుంటాం. ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు అందిస్తాం. పోలీసులకు మెరుగైన వేతనాలు, బకాయిలు చెల్లిస్తాం’ అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్