చరిత్రలో అత్యుత్తమ టీమ్ఇండియా ఇదే
రెండు నెలల క్రితం ఆస్ట్రేలియాలో చారిత్రక విజయం సాధించిన టీమ్ఇండియాను వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్లాయిడ్ ప్రశంసించాడు. కంగారూ గడ్డపై జరిగిన రసవత్తర పోరులో కోహ్లీసేన ప్రదర్శన తననెంతో ...
కోహ్లీసేనపై క్లైవ్లాయిడ్ ప్రశంసలు..
ఇంటర్నెట్డెస్క్: రెండు నెలల క్రితం ఆస్ట్రేలియాలో చారిత్రక విజయం సాధించిన టీమ్ఇండియాను వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్లాయిడ్ ప్రశంసించాడు. కంగారూ గడ్డపై జరిగిన రసవత్తర పోరులో కోహ్లీసేన ప్రదర్శన తననెంతో ఆకట్టుకుందన్నాడు. అడిలైడ్లో జరిగిన పింక్బాల్ టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాభవం మూటగట్టుకున్న తర్వాత బాగా పుంజుకొని సిరీస్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా కోలుకుందని, ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయించిందని మాజీ క్రికెటర్ గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘టీమ్ఇండియా ఇప్పుడున్న అత్యుత్తమ జట్టు. ఎందుకంటే ఇందులో భిన్నమైన ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడు వారంతా పూర్తి ఫిట్నెస్తో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో చాలాసార్లు వెనుకబడ్డా ఆ తర్వాత అద్భుతంగా రాణించి సిరీస్ కైవసం చేసుకున్నారు. ఇది మెచ్చుకోవాల్సిన విషయం. ఆ సిరీస్ నుంచి కోహ్లీసేన సాధిస్తున్న ఫలితాలు చూస్తే చరిత్రలో ఇదే అత్యుత్తమ టీమ్ఇండియా అని చెప్పొచ్చు’ అని క్లైవ్ లాయిడ్ ప్రశంసించాడు. కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ఇండియా వన్డే సిరీస్ కోల్పోయినా తర్వాత టీ20, టెస్టు సిరీస్ల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా అడిలైడ్ టెస్టులో రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌటయ్యాక భారత్ అద్భుతంగా పుంజుకుంది. రెండో టెస్టులో రహానె శతకంతో గెలిపించగా.. మూడో టెస్టులో అశ్విన్, విహారీ అసామాన్యమైన పోరాటం చేశారు. వీరిద్దరూ ఓడిపోయే మ్యాచ్ను డ్రాగా ముగించారు. దాంతో చివరిదైన నిర్ణయాత్మక నాలుగో టెస్టులో పంత్ చివరిరోజు దంచికొట్టి ఆస్ట్రేలియాను ఓడించాడు. దాంతో వరుసగా రెండో ఆసీస్ పర్యటనలోనూ టీమ్ఇండియా వారికి షాకిచ్చింది. ఆపై భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇంగ్లాండ్తోనూ ఇటీవల టెస్టు, టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు వన్డే సిరీస్లోనూ తొలి మ్యాచ్ గెలుపొందగా, మరో మ్యాచ్ గెలిస్తే ఈ సిరీస్ కూడా కోహ్లీసేన వశమౌతుంది. ఈ నేపథ్యంలోనే క్లైవ్లాయిడ్ భారత జట్టును మెచ్చుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!