DK: అతడే భవిష్యత్తులో ఐపీఎల్ బిగ్ స్టార్: దినేశ్ కార్తిక్
కుర్రాళ్లలోని ప్రతిభను బయటకు తేవడంతోపాటు వారికి ఆడే అవకాశాలను కల్పిస్తున్న లీగ్ ఐపీఎల్ (IPL 2023). అయితే, ఈసారి కొన్ని జట్లలోని యువ క్రికెటర్లు అదరగొట్టేస్తున్నారు. వారిలో అత్యుత్తమం ఎవరనే దానిపై సీనియర్ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో (IPL 2023) కొంతమంది కుర్రాళ్లు అదరగొట్టేస్తున్నారు. సన్రైజర్స్ నుంచి అభిషేక్ శర్మ, కోల్కతా ఆటగాడు రింకూ సింగ్, రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, సీఎస్కే ఆటగాడు శివమ్ దూబె.. ఇలా తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిలో ఎవరు బిగ్ స్టార్గా మారతారని అభిమానుల్లో తలెత్తిన అనుమానాలకు టీమ్ఇండియా ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు స్పందించారు. భారత సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్ అయితే తాను యశస్వి జైస్వాల్ వైపే మొగ్గు చూపుతానని చెప్పాడు. సురేశ్ రైనా కూడా యశస్వి ప్రతిభను ప్రశంసించాడు.
రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ భవిష్యత్తులో టాప్ ఆటగాడిగా మారతాడని దినేశ్ కార్తిక్ తెలిపాడు. యశస్వి ఈ సీజన్లో 8 మ్యాచుల్లోనే 304 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్రేట్ 147.57 కావడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ 2020 వేలంలో అతడిని రూ.2.4 కోట్లకు దక్కించుకుంది.
అతడి షాట్లలో అదే ప్రత్యేకం: రైనా
‘‘యశస్వి ఆడే విధానం చాలా బాగుంది. బంతిని గమనించే తీరు నన్ను ఆకట్టుకుంది. అతడు రివర్స్ స్వీప్ ఆడితే అలాగే చూడాలనిపిస్తుంది. తన శరీరానికి దగ్గరగా బంతిని ఆడేందుకు ప్రయత్నిస్తాడు. అదెంతో నచ్చింది. పెద్దగా కదలకుండానే భారీగా షాట్లు కొట్టేయగలుగుతున్నాడు. స్వింగ్ అవుతున్న బంతులను కూడా చాలా బాగా ఆడుతున్నాడు. మరీ ముఖ్యంగా కవర్డ్రైవ్లను ఆడే తీరు సూపర్బ్. ఉత్తమంగా వేసే బౌలర్ను గౌరవించి.. చెత్త బంతులను ఏమాత్రం ఉపేక్షించకుండా ధాటిగా ఆడేస్తాడు. తొలి ఆరు ఓవర్లలో ఓపెనర్ దూకుడుగా ఆడేయాలి. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో ఇన్నింగ్స్ వేగం తగ్గకుండా చూసుకోవాలి. ఇలాంటి ఐపీఎల్ సూపర్స్టార్లు భవిష్యత్తులో దేశానికి గర్వకారణమవుతారు’’ అని రైనా మెచ్చుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..