Gifts E-auction: నీరజ్ ఈటెకు రూ.1.5 కోట్లు.. సింధు రాకెట్కు రూ.80 లక్షలు
టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా ఉపయోగించిన ఈటెకు ఈ-వేలంలో భారీ ధర లభించింది. ప్రధానమంత్రికి
దిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా ఉపయోగించిన ఈటెకు ఈ-వేలంలో భారీ ధర లభించింది. ప్రధానమంత్రికి వచ్చిన బహుమతుల ఈ-వేలంలో భాగంగా నీరజ్కు, దేశానికి పసిడి పతకాన్ని అందించిన ఆ ఈటెను వేలానికి పెట్టగా.. రూ.కోటిన్నర ధర పలికింది. ఇక రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించిన భారత తొలి మహిళగా నిలిచిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు రాకెట్కు రూ.80,00,100 ధర లభించింది.
టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్లో భారత్ తరపున అద్భుత ప్రదర్శన చేసిన అథ్లెట్లు ప్రధాని మోదీకి బహూకరించిన క్రీడా పరికరాలతో పాటు ఆయనకు వివిధ సందర్భాల్లో వచ్చిన జ్ఞాపికలను ఆన్లైన్ వేదికగా వేలం వేసిన విషయం తెలిసిందే. కేంద్ర సాంస్కృతిక శాఖ pmmementos.gov.inలో ఈ వేలాన్ని నిర్వహించింది. మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబరు 17న మొదలైన ఈ-వేలం అక్టోబరు 7 గురువారంతో ముగిసింది. ఈ వేలంలో నీరజ్ ఈటె.. రూ.1.5కోట్లకు అమ్ముడైంది. ఈ-వేలంలో అత్యధిక ధర పలికిన వస్తువు ఇదే కావడం విశేషం. అయితే దీన్ని ఎవరు కొనుగోలు చేశారన్నది సాంస్కృతిక శాఖ బయట పెట్టలేదు. వేలం ఆరంభమైన రోజే ఈ ఈటెకు రూ.10 కోట్ల ధర పలికినప్పటికీ ఆ బిడ్ నకిలీదనే అనుమానంతో తొలగించారు.
భవానీదేవి కత్తికి రూ.1.25కోట్లు..
టోక్యో ఒలింపిక్స్లో భారత్ తరఫున ఫెన్సింగ్లో పోటీ పడ్డ మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించిన ఫెన్సర్ భవానీదేవి కత్తికి ఈ-వేలంలో రూ.1.25కోట్ల ధర లభించింది. పారాలింపిక్స్లో పసిడి సాధించిన సుమిత్ బళ్లెం రూ. రూ.కోటి 25వేలు పలికింది. పారాలింపిక్స్ విజేతలు సంతకాలు చేసి ప్రధానికి బహూకరించిన కండువాకు రూ.కోటి ధర లభించింది. టోక్యో ఒలింపిక్స్లో బాక్సింగ్ సంచలనం లవ్లీనా బోర్గొహేన్ చేతి గ్లౌజులు రూ.91లక్షల ధర పలికాయి.
ఆటగాళ్ల క్రీడా పరికరాలతో పాటు మోదీకి పలు సందర్భాల్లో వచ్చిన జ్ఞాపికలు, బహుమతులను కూడా వేలం వేశారు. మొత్తం 1348 వస్తువులకు ఈ-వేలానికి ఉంచగా.. వీటికి 8600 బిడ్లు వచ్చాయి. ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన నిధులను గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన నమామి గంగే కార్యక్రమం కోసం వెచ్చించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.