Cricket news: విజయంతో ఝులన్‌కు ఘనమైన వీడ్కోలు

ఇంగ్లాండ్‌ గడ్డపై మహిళా క్రికెట్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్‌ సొంత గడ్డపై ఆ జట్టును టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇదివరకే 2-0తో ముందంజలో ఉన్న భారత జట్టు ఈ మ్యాచ్‌లోనూ...

Updated : 26 Sep 2022 12:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఇంగ్లాండ్‌ గడ్డపై మహిళా క్రికెట్‌ జట్టు చరిత్ర సృష్టించింది. సొంత గడ్డపైనే ఆ జట్టును టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇదివరకే 2-0తో ముందంజలో ఉన్న భారత జట్టు ఈ మ్యాచ్‌లోనూ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడుతున్న దిగ్గజం ఝులన్‌ గోస్వామికి  భారత మహిళా జట్టు విజయంతో ఘనంగా వీడ్కోలు పలికింది. టీమ్‌ఇండియా మొదట బ్యాటింగ్‌ చేయగా.. స్మృతి మందాన (50), దీప్తి శర్మ (68) మాత్రమే రాణించడంతో భారత జట్టు 169 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ క్రికెటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా సయా సంచలనం రేణుకా సింగ్‌ 4 వికెట్లు తీసి టాప్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. ఝులన్‌ సైతం రెండు వికెట్లు తీసింది. ఛార్లొట్లే డీన్‌ (47) ఆ జట్టు టాప్‌ స్కోరర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని