sports News: క్వార్టర్స్లో స్పెయిన్ ..రొనాల్డోకు నిరాశే
యూరో 2020 ఫుట్బాల్ టోర్నీలో అగ్ర జట్టు స్పెయిన్ క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం రసవత్తరంగా సాగిన సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో ఆ జట్టు 5-3తో..
సెవిల్లె: యూరో 2020 ఫుట్బాల్ టోర్నీలో అగ్ర జట్టు స్పెయిన్ క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం రసవత్తరంగా సాగిన సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో ఆ జట్టు 5-3తో క్రొయేషియాపై విజయం సాధించింది. నిర్ణీత సమయానికి స్పెయిన్ 3-2తో ఆధిక్యంలో నిలవగా.. ఇంజురీ టైంలో మరియో పసాలిక్ గోల్ (90+2వ నిమిషం) కొట్టి స్కోరు సమం చేశాడు. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి మళ్లింది. స్వల్ప వ్యవధిలో మొరాటా (100వ ని.), ఒయార్జబల్ (103 వ ని.) గోల్స్ కొట్టి స్పెయిన్ను ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. ఆధిపత్యాన్ని కొనసాగించిన స్పెయిన్ మ్యాచ్ను సొంతం చేసుకుంది. అంతకుముందు డిఫెండింగ్ ఛాంపియన్ పోర్చుగల్కు షాక్ తగిలింది. క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని ఆ జట్టు దూకుడుకు.. ప్రపంచ నంబర్వన్ బెల్జియం కళ్లెం వేసి క్వార్టర్స్లో అడుగుపెట్టింది. సోమవారం ప్రి క్వార్టర్స్లో బెల్జియం 1-0 తేడాతో ఆ జట్టును ఓడించింది. మ్యాచ్లో ఎక్కువ భాగం పోర్చుగల్ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ చివరకు ప్రత్యర్థికే విజయం దక్కింది. 42వ నిమిషంలో థోర్గాన్ హజార్డ్ తన జట్టుకు గెలుపు గోల్ అందించాడు. రెండో అర్ధభాగంలో స్కోరు సమం చేసేందుకు పోర్చుగల్ గట్టిగానే ప్రయత్నించింది. కానీ బెల్జియం గోల్కీపర్ గోడలా నిలబడ్డాడు. గోల్ చేసేందుకు పోర్చుగల్ జట్టు 24 ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక్కటీ సఫలం కాలేదు. ఈ యూరో కప్లో అజేయంగా సాగుతున్న బెల్జియం క్వార్టర్స్లో ఇటలీతో తలపడనుంది.
రొనాల్డోకు నిరాశే
సెవిల్లె: అగ్రశ్రేణి ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు ఈ సీజన్ నిరాశజనకంగా సాగుతోంది. 2016లో తన జట్టును యూరో కప్లో విజేతగా నిలిపి.. దేశానికి తొలి ప్రధాన ట్రోఫీని అందించిన అతను.. ఈ సారి ఆ మాయను కొనసాగించలేకపోయాడు. ప్రి క్వార్టర్స్లోనే బెల్జియం చేతిలో పోర్చుగల్ ఓటమితో తీవ్ర నిరాశ చెందిన 36 ఏళ్ల రొనాల్డో బాధతో మైదానం వీడాడు. ఈ సారి యూరో కప్ను అతను గొప్పగానే ఆరంభించాడు. తొలి మూడు మ్యాచ్ల్లోనే అయిదు గోల్స్ చేసి.. ఆల్టైమ్ అంతర్జాతీయ గోల్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఇరాన్ మాజీ ఆటగాడు అలీ దేయ్ను అతను సమం చేశాడు. బెల్జియంతో మ్యాచ్లో అతనొక్క గోల్ చేసినా.. సరికొత్త చరిత్ర సృష్టించడంతో పాటు జట్టునూ కాపాడేవాడు. గత మ్యాచ్ల్లోని తన దూకుడు.. ఈ పోరులో కరవైంది. గోల్ చేసే అవకాశాలనూ సద్వినియోగం చేసుకోలేదు. మెరుపు వేగంతో పరుగెత్తి ప్రత్యర్థులను వెనక్కినెట్టే అతను.. ఆ జోరు ప్రదర్శించలేకపోయాడు. ఫ్రీ కిక్లనూ ఉపయోగించుకోలేకపోయాడు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్గా యూరో కప్లో అడుగుపెట్టిన ఆ జట్టు.. టైటిల్ నిలబెట్టుకోలేకపోయింది. అంతే కాకుండా అత్యధిక అంతర్జాతీయ గోల్స్లో ప్రపంచ రికార్డు సృష్టించేందుకు అతను ఇంకొంత కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. మరోవైపు ఈ ఏడాది ఉత్తమ ఫుట్బాల్ ఆటగాడి అవార్డూ తనకు దక్కేలా లేదు. తన క్లబ్బు జువెంచస్, తన జట్టు పోర్చుగల్ తరపున అతను ఈ సీజన్లో మొత్తం 40కి పైగా గోల్స్ చేసినప్పటికీ.. రొనాల్డో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. జువెంచస్కు ఇటాలియన్ లీగ్ (సిరీ- ఎ) టైటిల్ అందించకపోవడంతో వచ్చే ఏడాది ఆ క్లబ్బుతో ముగిసే అతని ఒప్పందాన్ని పొడిగిస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. ఈ ఏడాది అతను.. ఇటాలియన్ కప్, ఇటాలియన్ సూపర్ కప్ టైటిళ్లు మాత్రమే గెలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!