Gautam Gambhir: క్రీడాస్ఫూర్తి టీమ్ఇండియాకేనా? మీకు వర్తించదా?: ఆసీస్పై మండిపడ్డ గంభీర్
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు చివరి రోజు ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్ స్టో(Jonny Bairstow) ఔటైన విధానం వివాదానికి దారితీసింది. దీంతో ఆసీస్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిందంటూ పలువురు మండిపడుతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: యాషెస్ సిరీస్ (Ashes Series 2023) రెండో టెస్టులో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే.. ఈ టెస్టు ఐదో రోజు ఆటలో ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్ స్టో(Jonny Bairstow) ఔటైన విధానం వివాదానికి దారితీసింది. దీంతో ఆసీస్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిందంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్(Gautam Gambhir) కూడా ఆస్ట్రేలియా జట్టుపై తీవ్రంగా స్పందించాడు. ‘‘హే స్లెడ్జర్స్.. క్రీడా స్ఫూర్తి మీకు వర్తించదా..? కేవలం ఇండియన్స్కేనా?’’ అంటూ ట్విటర్లో గంభీర్ మండిపడ్డాడు.
అసలేం జరిగిందంటే.. చివరి రోజు తొలి సెషన్ ఆటలో ఇంగ్లాండ్ 193/5గా ఉన్న సమయంలో.. గ్రీన్ బౌన్సర్ను తప్పించుకునేందుకు బెయిర్స్టో కిందకు వంగాడు. బంతి వికెట్ కీపర్ కేరీ చేతుల్లోకి వెళ్లింది. ఇంతలో ఓవర్ పూర్తయిందనే ఉద్దేశంతో బెయిర్స్టో క్రీజు దాటాడు. వెంటనే వికెట్ కీపర్ అలెక్స్ కేరీ బంతిని కింద నుంచి విసిరి స్టంప్స్ పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లందరూ అప్పీల్ చేయగా.. బెయిర్స్టో, స్టోక్స్తో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్లు, స్టాండ్స్లోని అభిమానులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. బెయిర్స్టో పరుగు తీసేందుకు ప్రయత్నించలేదు కాబట్టి మూడో అంపైర్ ఎరాస్మస్ నాటౌట్ అంటాడేమోనని అనుకున్నారు. కానీ బంతి డెడ్ కాలేదని భావించి బెయిర్స్టోను అతడు స్టంపౌట్గా ప్రకటించాడు. దీంతో ఆస్ట్రేలియా సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు షాక్లో మునిగిపోయారు. ఆసీస్ కెప్టెన్ కమిన్స్తో బెయిర్స్టో, మరో ఎండ్లో ఉన్న కెప్టెన్ స్టోక్స్ మాట్లాడినా ఫలితం లేకపోయింది.
ఈ ఘటన అనంతరం స్టేడియంలోని ఇంగ్లాండ్ అభిమానులు ఆస్ట్రేలియాపై విమర్శలు చేస్తూ కేకలు వేశారు. ‘’ఇది పాత ఆసీస్ జట్టే.. ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటుంది’’ అని నినాదాలు చేస్తూ గతంలో బాల్ టాంపరింగ్కు పాల్పడిన ఘటనను వారు గుర్తు చేశారు.
ఇక ఈ ఘటనపై ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. ‘రన్నౌట్ అప్పీల్ను కమిన్స్ ఉపసంహరించుకోవాల్సి ఉండేదని స్టోక్స్ అన్నాడు. దీనిపై మీరేమంటారు?’ అని ప్రశ్నించగా.. ‘ఓకే’ అంటూ కమిన్స్ క్లుప్తంగా సమాధానమిచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..