WPL: విశాఖ క్రికెటర్.. రెండేళ్ల పాపను వదిలి..
మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో బాగా ఆడమని తన రెండేళ్ల తనయ క్రివా చెప్పిందని, ఈ సమయంలో ఆమెకు దూరంగా ఉండడం కష్టమేనని విశాఖపట్నం క్రికెటర్ స్నేహ దీప్తి తెలిపింది.
ముంబయి: మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో బాగా ఆడమని తన రెండేళ్ల తనయ క్రివా చెప్పిందని, ఈ సమయంలో ఆమెకు దూరంగా ఉండడం కష్టమేనని విశాఖపట్నం క్రికెటర్ స్నేహ దీప్తి తెలిపింది. దాదాపు పదేళ్ల క్రితమే భారత మహిళా క్రికెట్లో దీప్తి పేరు వినిపించింది. 2013లోనే 16 ఏళ్లకే ఆమె టీ20, వన్డేల్లో జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేసింది. ఇప్పుడు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్గా ఎదిగిన స్మృతి మంధాన కూడా అప్పుడు ఆ బంగ్లాదేశ్తో టీ20 సిరీస్తోనే అరంగేట్రం చేసింది. అవకాశాలు వచ్చి, అద్భుత ప్రదర్శనతో మంధాన జట్టులో కీలక బ్యాటర్గా మారగా.. దీప్తికి అదృష్టం కలిసి రాలేదు. అవకాశాలు రాక జట్టుకు దూరమైంది. కేవలం రెండు టీ20లు, ఓ వన్డే మాత్రమే ఆడింది. ఆంధ్ర తరపున దేశవాళీ క్రికెట్లో కొనసాగుతూ వచ్చింది.
ఇప్పుడు రెండేళ్ల చిన్నారికి అమ్మగా ఉన్న ఆమెకు.. డబ్ల్యూపీఎల్ రూపంలో రెండో అవకాశం తలుపు తట్టింది. ఇటీవల వేలంలో 26 ఏళ్ల దీప్తిని దిల్లీ క్యాపిటల్స్ రూ.30 లక్షలకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్లో సత్తాచాటి.. మళ్లీ జాతీయ జట్టుకు ఎంపికవాలనే లక్ష్యంతో ఆమె సన్నద్ధమవుతోంది. శనివారం ఆరంభమయ్యే డబ్లూపీఎల్ ఆరంభ సీజన్ కోసం దిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో చేరి సాధన మొదలెట్టింది. క్రివాను వదిలిపెట్టి ప్రాక్టీస్కు రావడం చాలా కష్టంగా ఉందని దీప్తి భావోద్వేగానికి గురైంది.
దిల్లీ క్యాపిటల్స్ పోస్టు చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ముంబయిలో జట్టు ఉన్న హోటల్కు వచ్చే సమయంలో తనను వదిలి వస్తున్నందుకు క్రివా ఏడ్చింది. అప్పుడు వెళ్లాలా? వద్దా? అనే సందేహం కలిగింది. క్రికెట్, కుటుంబం రెండూ నాకు ప్రధానమే. కెరీర్ ఎంతో ముఖ్యమైంది. ఇంత దూరం వచ్చా కాబట్టి ఇక వెనుకడుగు వేయొద్దనుకున్నా. జట్టుతో చేరాలని నిర్ణయించుకున్నా. పూర్తిస్థాయిలో నా ఆటను ఆస్వాదించాలి. ఇది నాకో మంచి అవకాశం. లీగ్లో ఉత్తమ ప్రదర్శనతో విజయవంతమవ్వాలి. అమ్మాయిలకు ఆదర్శంగా నిలవాలనుకుంటున్నా. నేను సాధించగా లేనిది.. మిగతావాళ్లు ఎందుకు చేయలేరు? అనేలా స్ఫూర్తి నింపాలనుకుంటున్నా’’ అని ఆమె తెలిపింది.
కూతురును జాగ్రత్తగా చూసుకుంటానని శిబిరానికి బయల్దేరే ముందు భర్త మాటిచ్చాడని దీప్తి వెల్లడించింది. ‘‘ఈ సమయంలో క్రివాకు దూరంగా ఉండడం చాలా కష్టం. కానీ నా భర్త మాటిచ్చాడు. ‘నువ్వు వెళ్లు, నేను క్రివాను చూసుకుంటా’ అని చెప్పాడు. హోటల్ చేరిన వెంటనే ఆయనకు ఫోన్ చేశా. అప్పుడు క్రివా నవ్వుతూ మాట్లాడింది. ‘బాగా ఆడు’ అని చెప్పింది’’ అని దీప్తి పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో పాపకు జన్మనిచ్చిన దీప్తి, తిరిగి సెప్టెంబర్లో దేశవాళీ క్రికెట్ ఆడింది. ఆమెకు వేలంలో మంధాన లాగా రూ.కోట్లు రాకపోవచ్చు కానీ తాను ప్రేమించే ఆటలో సత్తాచాటేందుకు మరో గొప్ప అవకాశం దక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!