ఎర్రకోట ఇగాఇలాకా
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ అనగానే అస్థిర ఫలితాలుంటాయ్! ఎర్ర మట్టి కోర్టులో ఎవరు ఛాంపియన్ అవుతారో ఊహించలేం! సెరెనా విలియమ్స్ లాంటి దిగ్గజాలు కూడా రొలాండ్ గారోస్లో ఆధిపత్యం చెలాయించలేకపోయారు.
స్వైటెక్కు మూడో ఫ్రెంచ్ టైటిల్
ఫైనల్లో ముచోవాపై గెలుపు
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ అనగానే అస్థిర ఫలితాలుంటాయ్! ఎర్ర మట్టి కోర్టులో ఎవరు ఛాంపియన్ అవుతారో ఊహించలేం! సెరెనా విలియమ్స్ లాంటి దిగ్గజాలు కూడా రొలాండ్ గారోస్లో ఆధిపత్యం చెలాయించలేకపోయారు. అలాంటిది గత నాలుగేళ్లలో మూడో ఫ్రెంచ్ టైటిల్ గెలవడం అంటే!! అది ఇగా స్వైటెక్కే సాధ్యమైంది. ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ.. ఈ టోర్నీలో మరోసారి తన ముద్ర వేసిన లేడీ నాదల్.. అదిరే ఆటతో టైటిల్ నిలబెట్టుకుంది. తుది పోరులో ముచోవా నుంచి ప్రతిఘటన ఎదురైనా నిలిచిన ఈ 22 ఏళ్ల పోలెండ్ స్టార్ ట్రోఫీ చేజిక్కించుకుంది.
పారిస్
ప్రపంచ నంబర్వన్ స్వైటెక్ అదరగొట్టింది. జోరు కొనసాగిస్తూ ఈ డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రెంచ్ ఓపెన్ను మరోసారి ముద్దాడింది. శనివారం మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వైటెక్ 6-2, 5-7, 6-4తో కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. ఈ మ్యాచ్ ఆరంభంలో స్వైటెక్ దూకుడు చూస్తే ఫైనల్ ఏకపక్షం అయ్యేలా కనిపించింది. తొలి సెట్ గెలిచి.. రెండో సెట్లో 3-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉన్న స్వైటెక్.. ఛాంపియన్షిప్ గెలిచేందుకు మూడు గేమ్ల దూరంలో నిలిచింది. కానీ అనూహ్యంగా పుంజుకున్న ముచోవా.. ఇగాకు గట్టిపోటీ ఇచ్చింది. తొలి సెట్తో పోలిస్తే మెరుపు సర్వీసులతో విజృంభించిన ఈ చెక్ అమ్మాయి.. ఫోర్హ్యాండ్ విన్నర్లతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. దీంతో అనవసర తప్పిదాలు చేసిన ఇగా.. అయిదో గేమ్లో సర్వీస్ కోల్పోయింది. ముచోవా పట్టు వదలకపోవడం.. స్వైటెక్ తగ్గకపోవడంతో సెట్ నువ్వానేనా అన్నట్టుగా సాగింది. పదకొండో గేమ్లో మరో బ్రేక్ సాధించిన ముచోవా.. ఆ తర్వాత సర్వీస్ నిలబెట్టుకుని సెట్ గెలిచి మ్యాచ్లో నిలిచింది. ఆఖరి సెట్ ఆరంభంలోనూ సర్వీస్ కోల్పోయినా.. ముచోవా పోరాటం ఆపలేదు. ఆ తర్వాత స్వైటెక్ సర్వీస్ బ్రేక్ చేసి మళ్లీ స్కోరు సమం చేసింది. కానీ ఒత్తిడిలోనూ స్థిరంగా ఆడి తొమ్మిదో గేమ్ నిలబెట్టుకున్న ఇగా 5-4తో విజయం ముంగిట నిలిచింది. పదో గేమ్లో 15-40తో వెనుకబడిన సమయంలో ముచోవా డబుల్ఫాల్ట్ చేయడంతో ఇగా సెట్తో పాటు టైటిల్ను ఎగరేసుకుపోయింది. మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను కాట్లో (జపాన్)-పజ్ (జర్మనీ) జోడీ నెగ్గింది. ఫైనల్లో ఈ జోడీ 4-6, 6-4, 10-6తో ఆండ్రెస్క్యూ (కెనడా)- మైకేల్ వీనస్ (ఆస్ట్రేలియా)ను ఓడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.