IRE vs IND: క్లీన్స్వీప్పై భారత్ కన్ను
క్లీన్స్వీప్పై కన్నేసిన టీమ్ఇండియా ఐర్లాండ్తో ఆఖరి పోరుకు సిద్ధమైంది. బుధవారమే చివరిదైన మూడో టీ20. తొలి రెండు మ్యాచ్ల్లో విజయంతో భారత్ ఇప్పటికే సిరీస్ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఐర్లాండ్తో చివరి టీ20 నేడు
రాత్రి 7.30 నుంచి డబ్లిన్
క్లీన్స్వీప్పై కన్నేసిన టీమ్ఇండియా ఐర్లాండ్తో ఆఖరి పోరుకు సిద్ధమైంది. బుధవారమే చివరిదైన మూడో టీ20. తొలి రెండు మ్యాచ్ల్లో విజయంతో భారత్ ఇప్పటికే సిరీస్ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేసిన పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ట ఫిట్నెస్ను నిరూపించుకోవడం జట్టుకు సంతోషాన్నిచ్చే విషయం. మరోవైపు రిజర్వ్ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఈ నామమాత్రమైన మ్యాచ్ టీమ్ఇండియాకు ఓ చక్కని అవకాశం. అవేష్ ఖాన్, జితేశ్ శర్మ, షాబాజ్ అహ్మద్ ఇప్పటివరకు సిరీస్లో ఆడలేదు. నిజానికి విండీస్ పర్యటనలోనూ జట్టులో ఉన్న అవేష్ మొత్తంగా వరుసగా ఏడు మ్యాచ్ల్లో బెంచ్కు పరిమితం కావాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో నిలకడగా రాణించలేకపోతున్న అర్ష్దీప్ సింగ్ స్థానంలో అతణ్ని తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది. సంజు శాంసన్కు విశ్రాంతినిచ్చి వికెట్కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మకు అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వొచ్చు. దేవధర్ ట్రోఫీలో విశేషంగా రాణించి ఆత్మవిశ్వాసంతో ఉన్న షాబాజ్ అహ్మద్ భారత్కు మరో ఆల్రౌండ్ ప్రత్యామ్నాయం. వాషింగ్టన్ సుందర్కు విశ్రాంతి కల్పించి షాబాజ్ను ఆడించే అవకాశాలు మెండు. ఆసియాకప్కు ముందు కెప్టెన్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ మరింత మ్యాచ్ టైమ్ కోరుకుంటున్న నేపథ్యంలో వారికి విశ్రాంతినిచ్చే అవకాశం లేదు. ఇక సంజు స్థానంలో జితేశ్ను ఆడించడం మినహా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఉండే వీలు లేదు. రెండో టీ20తో అరంగేట్రం చేసిన రింకూ 21 బంతుల్లో 38 పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అతడితో పాటు యశస్వి, రుతురాజ్ గైక్వాడ్లు తమదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. ఇక ఐర్లాండ్ తరఫున ఎడమచేతి వాటం స్పిన్నర్ వాన్ వోర్కమ్ అరంగేట్రం చేయొచ్చు. తిరుగులేని ఫేవరెట్గా బరిలోకి దిగుతున్న భారత్ను క్లీన్స్వీప్ చేయకుండా అడ్డుకోవడం ఐర్లాండ్కు కష్టమైన పనే.
పిచ్ ఎలా ఉందంటే..: వాతావరణం మబ్బు పట్టి ఉంటుంది. ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. కానీ మ్యాచ్ పూర్తిగా జరగొచ్చు.
4.88
ఈ సిరీస్లో బుమ్రా ఎకానమీ. మరే బౌలర్కు కూడా ఓవర్కు ఆరు లోపు ఎకానమీ లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
ఐపీఎల్లో సత్తా చాటుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి.. ఏపీఎల్లోనూ భారీ ధరను దక్కించుకోవడం విశేషం. -
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
ఆదివారం రాజస్థాన్తో కోల్కతా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లూ ప్లేఆఫ్స్నకు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ ఆటతీరుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
వరల్డ్ కప్ జట్టులో కొందరు యువ క్రికెటర్లకు అవకాశం రాలేదు. అనుకోకుండా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ జట్టులోకి వచ్చాడు. అతడి ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. -
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే