Hardik Pandya: చీలమండ వాచిపోయింది.. రక్తాన్ని తొలగించాల్సి వచ్చింది: హార్దిక్ పాండ్య
గాయం కారణంగా ఆటకు దూరం కావడం తననెంతో నిరాశపరిచిందని.. బయట నుంచి వచ్చే కామెంట్లను పట్టించుకోనని భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) సందర్భంగా గాయపడి దాదాపు నాలుగు నెలలపాటు హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ 17వ సీజన్ (IPL 2024) కోసం ప్రాక్టీస్ను ప్రారంభించిన పాండ్య గత వరల్డ్ కప్ కోసం సన్నద్ధత, గాయపడినప్పుడు ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడాడు. మెగా టోర్నీకి ముందు 25 రోజులపాటు రిహాబిలిటేషన్కు సమయం ఇచ్చినా.. ఐదు రోజుల్లోనే జట్టుతో చేరేందుకు పాండ్య వచ్చాడు. కానీ, టోర్నీ మధ్యలో తీవ్రంగా ఇబ్బందిపడి వైదొలిగాడు. దీంతో మళ్లీ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.
‘‘రెండు లేదా మూడు నెలల ముందే వరల్డ్ కప్ కోసం సన్నద్ధమయ్యే ఆటగాడిని కాదు. నా ప్రయాణం ఏడాదిన్నర ముందే మొదలుపెట్టా. ఎలా సిద్ధం కావాలనే దానిపై ప్రణాళికలు రూపొందించుకున్నా. ఒక్కసారిగా గాయపడటంతో ఇబ్బందిపడ్డా. చాలా తక్కువ మందికే దాని గురించి తెలుసు. ఒకవేళ 25 రోజులపాటు విశ్రాంతి తీసుకుంటే నేను వరల్డ్ కప్ మిస్ అయ్యేవాడిని. కానీ, ఐదు రోజుల్లోనే వస్తానని మేనేజ్మెంట్కు చెప్పా. దాని కోసం నా చీలమండకు వివిధ చోట్ల ఇంజెక్షన్లు చేయించుకున్నా. వాచిపోవడంతో ఒకసారి రక్తాన్ని తొలగించాల్సి వచ్చింది’’ అని చెప్పాడు.
‘‘ఇలాంటి పరిస్థితుల్లో వెనక్కి వెళ్లకూడని బలంగా నిశ్చయించుకున్నా. నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలని భావించా.ఒకవేళ మళ్లీ గాయానికి గురైతే సుదీర్ఘకాలంపాటు ఆటకు దూరం కావాల్సి ఉంటుంది. దానికి నా వద్ద సమాధానం లేదు. ఒక్క శాతం అవకాశం ఉన్నా జట్టుతో పాటు ఉండేందుకు ప్రయత్నిస్తా. దురదృష్టవశాత్తూ గాయం మళ్లీ తిరగబెట్టింది. దాంతో మూడు నెలలపాటు ఆటకు దూరంగా ఉండాలని చెప్పారు. ఆరంభంలో నడవడానికి కూడా వీలు కాలేదు. వరల్డ్ కప్లో ఆడటం నాకెంతో గర్వకారణం. అంతకుమించిన మరొకటి ఉండదు. అందుకోసం పెయిన్ కిల్లర్స్ను తీసుకొని పది రోజుల్లోనే సిద్ధమయ్యా’’ అని హార్దిక్ తెలిపాడు. ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఈసారి హార్దిక్ పాండ్య ఐపీఎల్ ఆడనున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!