Jaydev Unadkat: చెన్నైతో మ్యాచ్.. స్లో బంతులు సంధించడానికి కారణమదే: జయ్దేవ్ ఉనద్కత్
ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నైను ఓడించిన హైదరాబాద్ పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది. హార్డ్ హిట్టర్లు కలిగిన చెన్నైను కట్టడి చేయడంలో హైదరాబాద్ బౌలర్లు సక్సెస్ అయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: చెన్నైతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ పేసర్లు ఎక్కువగా స్లో ఆఫ్ కట్టర్ బంతులను సంధించారు. దీంతో అప్పటి వరకు దూకుడుగా ఆడిన శివమ్ దూబె కూడా ఇబ్బంది పడ్డాడు. చివర్లో వేగంగా ఆడేందుకు ప్రయత్నించి రవీంద్ర జడేజాను హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేయడంలో విజయవంతమయ్యారు. అలా స్లో బంతులు సంధించడానికి గల కారణాన్ని బయటపెట్టాడు హైదరాబాద్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్. పిచ్ కూడా మందకొడిగా ఉండటంతో ఫాస్ట్ కంటే స్లో బంతులను సంధించడం మంచిదని భావించినట్లు తెలిపాడు. జయ్దేవ్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక వికెట్ తీసి 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
‘‘ఉప్పల్ పిచ్ నెమ్మదిగా మారిపోయింది. ఫాస్ట్గా బంతులేసినా బ్యాటర్లకు పరుగులు రాబట్టేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. దీంతో పరిస్థితికి అనుగుణంగా పిచ్ను సద్వినియోగం చేసుకోవాలని భావించాం. ఆఫ్ కట్టర్లు, స్లో బంతులను సంధించాం. వైవిధ్యంగా బౌలింగ్ చేయడం వల్ల చెన్నై బ్యాటర్లను కట్టడి చేయగలిగాం’’ అని ఉనద్కత్ తెలిపాడు. హైదరాబాద్ పిచ్పై ఐపీఎల్లో 8 మ్యాచ్లు ఆడిన అతడు 14 వికెట్లు పడగొట్టాడు.
ఆ విషయంలో రుతురాజ్ తికమక పడ్డాడు: మాజీ క్రికెటర్లు
ఎంఎస్ ధోనీ (MS Dhoni) చివరి మూడు బంతులు ఉండగా క్రీజ్లోకి వచ్చాడు. కేవలం రెండు బంతులను మాత్రమే ఎదుర్కొని ఒక్క పరుగే చేశాడు. అతడు ఇంకాస్త ముందుగా బ్యాటింగ్కు పంపిస్తే బాగుండేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ‘‘ధోనీ విషయంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తికమకపడుతున్నట్లు ఉంది. దిల్లీపై అదరగొట్టిన ధోనీని బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపాల్సింది. కేవలం మూడు బంతుల కోసమే మైదానంలోకి రావాల్సి అవసరం ఏముంది? ఇలాంటి నిర్ణయాలు ఆశ్చర్యానికి గురి చేస్తోంది’’ అని మైకెల్ వాన్ అన్నాడు. ‘‘భువనేశ్వర్, ఉనద్కత్ ఆఫ్ కట్టర్లు, స్లో బంతులు వేస్తున్నప్పుడు.. రవీంద్ర జడేజా కాకుండా కుడి చేతివాటం బ్యాటర్ ధోనీ క్రీజ్లోకి వచ్చుంటే బాగుండేది. అలాంటి బౌలింగ్లో ధోనీ భారీ షాట్లు కొట్టగలడు’’ అని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పోస్టు పెట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా సభ్యులు వీరే!
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తారు. న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ భవనంపై టీమ్ఇండియా సభ్యుల పేర్లను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తమ జట్లను ప్రకటించాయి. -
టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. -
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. -
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..