ODI WC 2023: పాక్ కోచ్ మికీ ఆర్థర్ ‘బీసీసీఐ’ ఈవెంట్ కామెంట్లకు ఐసీసీ కౌంటర్!
వరల్డ్ కప్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారత్-పాకిస్థాన్ (INDvsPAK) మ్యాచ్ నిర్వహణపై కోచ్ మికీ ఆర్థర్ చేసిన కామెంట్లపై ఐసీసీ స్పందించింది.
ఇంటర్నెట్ డెస్క్: వరల్డ్ కప్లో భారత్-పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ను చూస్తుంటే ఐసీసీ ఈవెంట్లా కాకుండా బీసీసీఐ ఈవెంట్ వలే ఉందన్న మికీ ఆర్థర్ వ్యాఖ్యలపై ఐసీసీ స్పందించింది. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే పేర్కొన్నాడు. ‘‘మేం నిర్వహించే ప్రతి ఈవెంట్ సందర్భంగా ఏదో ఒక దశలో ఇలాంటి విమర్శలు వస్తుంటాయి. అయితే, వాటికి దూరంగా ఉంటాం. మరింత ఉత్తమంగా టోర్నీని నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడే ఈ మెగా సమరం (ODI World Cup 2023) ప్రారంభమైంది. ఇంకా చాలా మ్యాచ్లు జరగాల్సి ఉంది. ఇంకేం మార్పులు చేయాలి..? మరింత నాణ్యంగా ఎలా నిర్వహించాలి? అనే విషయాలపై కసరత్తు చేస్తాం. క్రికెట్ను ప్రతి ఒక్కరికీ చేరువ చేసేందుకు ఎల్లవేళలా ప్రయత్నిస్తూనే ఉంటాం. కచ్చితంగా ఇదొక అత్యుత్తమ వరల్డ్ కప్గా నిలుస్తుందన్నది మా నమ్మకం’’ అని బార్క్లే స్పష్టం చేసినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇంతకీ మికీ ఆర్థర్ ఏమన్నాడంటే..?
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పాక్పై భారత్ ఆధిపత్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ అనంతరం పాక్ క్రికెట్ జట్టు కోచ్ మికీ ఆర్థర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడాడు. తమ జట్టు ప్రదర్శన నిరాశపరిచిందని చెబుతూనే.. ఐసీసీపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. తమ జట్టు ఆడేటప్పుడు మైదానంలో సరైన మద్దతు లభించలేదని.. ఇది ఐసీసీ ఈవెంట్లా కాకుండా ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్ అనిపించిందని వ్యాఖ్యానించాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పాక్ మాజీ క్రికెటర్ల నుంచే మికీ ఆర్థర్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం కంటే ముందు ఓటమికిగల కారణాలను విశ్లేషించుకోవాలని పాక్ మాజీలు హితవు పలికారు.
వన్డే ప్రపంచకప్ చరిత్రలో పాక్పై భారత్ (IND vs PAK) ఆధిక్యం కొనసాగింది. తాజా విజయం మెగా టోర్నీల్లో ఎనిమిదోది కావడం విశేషం. గతంలో కాస్త పోటీనిచ్చే పాక్.. ఈసారి మాత్రం ఘోరంగా విఫలమైంది. అదే సమయంలో కోహ్లీ నుంచి పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ భారత జెర్సీలను అడిగి తీసుకోవడంపైనా విమర్శలు రేగాయి. ఇలాంటి సమయంలో బహిరంగంగా కాకుండా.. ప్రైవేట్గా తీసుకొని ఉంటే బాగుండేదని మాజీలు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా