IND vs AUS: లక్ష్యం స్వల్పమే.. కేఎల్ పోరాటం అపూర్వం..
కేఎల్ రాహుల్ (KL Rahul) అద్భుతమైన పోరాటంతో ఆసీస్పై భారత్ తొలి వన్డేలో (IND vs AUS) విజయం సాధించింది. స్వల్ప లక్ష్యం ఉన్నప్పటికీ.. పిచ్ బౌలింగ్కు సహకరించడంతో ఛేదన కఠినంగా సాగింది.
ఇంటర్నెట్ డెస్క్: మూడు వన్డేల సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్పై టీమ్ఇండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా ఆరంభంలో తడబాటుకు గురైనప్పటికీ.. కేఎల్ రాహుల్ (75*) అర్దశతకం సాధించి భారత్ను గెలిపించాడు. రాహుల్కు తోడుగా రవీంద్ర జడేజా (45*) కీలక పరుగులు సాధించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే మ్యాచ్ వైజాగ్ వేదికగా మార్చి 19వ తేదీ (ఆదివారం) జరగనుంది. బ్యాటింగ్, బౌలింగ్లో రాణించిన రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
స్టార్క్ మెరుపులకు అడ్డుకట్ట
ఆసీస్ను 188 పరుగులకే ఆలౌట్ చేశామనే ఆనందం భారత ఇన్నింగ్స్ ప్రారంభమైన కొంతసేపటికి అభిమానుల్లో ఆవిరైంది. తొలుత ఓపెనర్ ఇషాన్ కిషన్ (3)ను స్టొయినిస్ ఔట్ చేయగా.. తర్వాత విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ (0)ను వరుస బంతుల్లో స్టార్క్ ఔట్ చేసి భారత్ను దెబ్బ కొట్టాడు. అయితే కుదురుకుని ఆడిన శుభమన్ గిల్ (20)ను కూడా స్టార్క్ ఔట్ చేశాడు. అయితే, హార్దిక్ పాండ్య (25)తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను నిర్మించాడు. కానీ, కీలక సమయంలో హార్దిక్ ఔట్ కావడంతో భారత్ చిక్కుల్లో పడింది. మరో వికెట్ పడితే పరిస్థితి ప్రమాదకరంగా మారేది. కానీ, జడేజాను టాప్ ఆల్రౌండర్ ఎందుకంటారో.. మరోసారి నిరూపించుకున్నాడు. కేఎల్ రాహుల్ - జడేజా ఆరో వికెట్కు ఏకంగా 108 పరుగులు జోడించారు. దీంతో మరో వికెట్ పడనీయకుండా భారత్ను గెలిపించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ 3, స్టొయినిస్ 2 వికెట్లు తీశారు.
మిచెల్ మార్ష్ ఒక్కడే..
మ్యాచ్ ఆరంభంలో పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. దీంతో ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ (81) దూకుడుగా ఆడాడు. మరో ఓపెనర్ హెడ్ (5) త్వరగా ఔటైనప్పటికీ స్మిత్తో (22) కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, లబుషేన్ (15), జోష్ ఇంగ్లిస్ (26) మినహా ఎవరి నుంచి మద్దతు లభించకపోవడంతో సెంచరీ దిశగా సాగిన మార్ష్ భారీ షాట్లకు యత్నించి పెవిలియన్కు చేరాడు. భారత బౌలర్లలో షమీ 3, సిరాజ్ 3, జడేజా 2.. హార్దిక్, కుల్దీప్ చెరో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్