42 ఏళ్ల నిరీక్షణకు రహానె తెరదించుతాడా?

నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు చెరో విజయంతో 1-1తో సమంగా నిలిచాయి. కాగా, సిడ్నీ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ రేసులో ముందుండాలని...

Published : 05 Jan 2021 16:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు చెరో విజయంతో 1-1తో సమంగా నిలిచాయి. కాగా, సిడ్నీ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ రేసులో ముందుండాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే సిడ్నీ మైదానంలో భారత్‌కు గొప్ప రికార్డేమి లేదు. ఆడిన 12 టెస్టుల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. 1978లో బిషన్‌సింగ్‌ బేడి నాయకత్వంలో టీమిండియా ఇన్నింగ్స్‌ రెండు పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తుచేసింది. ఆ తర్వాత తొమ్మిది టెస్టుల్లో భారత్‌ తలపడినా మరో గెలుపు అందుకోలేకపోయింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై మిగిలిన టెస్టులను డ్రా గా ముగించింది.

అయితే తొలి టెస్టు ఘోరపరాజయం అనంతరం ప్రతికూలతల నడుమ రెండో టెస్టులో భారత జట్టును రహానె గొప్పగా నడిపించాడు. కీలక ఆటగాళ్ల గైర్హాజరీలోనూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. విజయోత్సాహంతో మూడో టెస్టులోనూ కంగారూలపై పైచేయి సాధించి.. 42 ఏళ్ల ‘సిడ్నీ గెలుపు’ నిరీక్షణకు రహానె తెరదించుతాడని భారత్‌ అభిమానులు ఆశిస్తున్నారు. మరి, తన కెప్టెన్సీలో ఓటమెరుగని రహానె ఈ అరుదైన ఘనత సాధిస్తాడో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిఉండాల్సిందే.

మరో రెండు రికార్డులు

సిడ్నీ టెస్టులో రహానె జట్టును గెలిపిస్తే మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంటాడు. తొలి నాలుగు టెస్టులు విజయం సాధించిన భారత కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ సరసన నిలుస్తాడు. ఇప్పటివరకు మూడు టెస్టులకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించిన రహానె అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే బ్యాట్స్‌మన్‌గానూ రహానె మరోరికార్డుపై కన్నేశాడు. మరో 203 పరుగులు చేస్తే కంగారూల గడ్డపై 1000 పరుగులు పూర్తిచేసిన అయిదో భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఈ జాబితాలో సచిన్ (1809), కోహ్లీ (1352) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

ఇదీ చదవండి

సవాళ్లకు సిద్ధంగా ఉన్నా: నట్టూ

షాక్‌: టెస్టు సిరీస్‌కు రాహుల్ దూరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని