Sarfaraz Khan: మీటింగుల్లో రోహిత్ మాట్లాడుతుంటే.. లగాన్ సినిమా గుర్తుకొస్తుంది: సర్ఫరాజ్ ఖాన్
కుర్రాళ్లను ప్రోత్సహించడంలో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ముందుంటాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ సర్ఫరాజ్ ఖాన్. డొమిస్టిక్ క్రికెట్లో భారీగా పరుగులు చేసిన అతడికి ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో అవకాశం కల్పించాడు.
ఇంటర్నెట్ డెస్క్: దేశవాళీ క్రికెట్లో అదరగొట్టి.. జాతీయ జట్టులో స్థానం కోసం చాన్నాళ్లు ఎదురు చూసిన సర్ఫరాజ్ ఖాన్కు (Sarfaraz Khan) ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో అవకాశం దక్కింది. అక్కడ తన సత్తా చాటాడు. మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలో ఆడటంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో, డ్రెస్సింగ్ రూమ్, జట్టు సమావేశాల్లో సారథిగా రోహిత్ ఎలా ఉంటాడనే విషయాలను వెల్లడించాడు.
‘‘రోహిత్ శర్మ నాయకత్వంలో ఆడటాన్ని ఆస్వాదించా. ఐపీఎల్లోనూ 9 ఏళ్ల నుంచి వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. కానీ, హిట్మ్యాన్ కెప్టెన్సీలో ఎన్నో అనుభవాలను సొంతం చేసుకున్నా. అతడిని చూసినప్పుడల్లా తెలియని గౌరవభావం కలుగుతుంది. ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తాడు. జట్టు సమావేశాల్లో అతడు దేని గురించైనా మాట్లాడుతుంటే.. నాకు ఆమిర్ ఖాన్ సినిమా లగాన్ గుర్తుకొస్తుంది. మైదానంలో లేదా డ్రెస్సింగ్ రూమ్లో సహచరులను రోహిత్ ఎప్పుడూ తూలనాడడు. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా గట్టిగా చెబుతాడు. అయితే, చెప్పే విధానం విభిన్నంగా ఉంటుంది. మమ్మల్ని తిడుతున్నట్లు మాకేమీ అనిపించదు. ముంబయిలో మాట్లాడే తీరు అలానే ఉంటుంది. జట్టు సహచరులతో అతడి అనుబంధం చాలా బాగుంటుంది. సీనియర్ను అనే అహంభావం ప్రదర్శించడు’’
‘‘చిన్నప్పటి నుంచి టెస్టు క్రికెట్ గొప్పదనం గురించి వింటూనే ఉన్నా. మా నాన్న కూడా సుదీర్ఘ ఫార్మాట్లో సత్తా చాటితేనే క్రికెటర్గా నిలదొక్కుకోవచ్చని చెబుతారు. నేను తొలిసారి సిరీస్ ఆడుతున్నప్పుడు కాస్త ఒత్తిడి అనిపించినా.. దానిని త్వరగానే అధిగమించా. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతులమీదుగా క్యాప్ అందుకోవడం చిరస్మరణీయం. మరో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రశంసలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన సూచనలనూ తప్పకుండా పాటిస్తా. నేను టెస్టుల్లోకి అరంగేట్రం చేశాక.. నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగింది. అంతకుముందు 6 లక్షల నుంచి 7 లక్షలు ఉండే ఫాలోవర్లు 1.5 మిలియన్లకు చేరారు. భారత జట్టుకు ఆడటం వల్లే ఇదంతా సాధ్యమైంది’’ అని సర్ఫరాజ్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!