SA vs IND: రెండో టెస్టులో టీమ్ఇండియా విజయం.. 1-1తో సిరీస్ సమం
దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ను టీమ్ఇండియా 1-1 తేడాతో సమం చేసింది. కేప్టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కేప్టౌన్: దక్షిణాఫ్రికా పర్యటన (SA vs IND)ను టీమ్ఇండియా ఘన విజయంతో ముగించింది. సఫారీలతో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ను రోహిత్ సేన 1-1 తేడాతో సమం చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు 55 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమ్ఇండియా 153 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికాను టీమ్ఇండియా 176 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం 79 పరుగుల లక్ష్యాన్ని భారత్ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్ (28; 23 బంతుల్లో 6 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలతో అలరించాడు. రోహిత్ శర్మ (17*; 22 బంతుల్లో 2 ఫోర్లు) కూడా దూకుడుగా ఆడాడు. విరాట్ కోహ్లీ (12), శుభ్మన్ గిల్ (10), శ్రేయస్ అయ్యర్ (4*) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, నండ్రీ బర్గర్, మార్కో జాన్సన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో విజయం సాధించి టెస్టు కెరీర్కు ఘనంగా వీడ్కోలు పలుకుదామనుకున్న డీన్ ఎల్గర్కు నిరాశే ఎదురైంది. బ్యాటింగ్లోనూ అతడు విఫలమయ్యాడు. ఎల్గర్ చివరి టెస్టు సందర్భంగా అతడికి భారత ఆటగాళ్లు అభినందనలు తెలిపారు.
అంతకుముందు ఓవర్నైట్ 62/3 స్కోరుతో రెండో రోజు ఆట ఇన్నింగ్స్ను కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 114 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. 36 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన మార్క్రమ్ (106; 103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.జస్ప్రీత్ బుమ్రా (6/61) విజృంభణతో ఆతిథ్య జట్టు మొదటి 10 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించకున్నా మార్క్రమ్ మాత్రం ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ముకేశ్ కుమార్ 2, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కో వికెట్ పడగొట్టారు.
సఫారీలను బెంబేలెత్తించిన సిరాజ్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాను మహ్మద్ సిరాజ్ (6/15) బెంబేలెత్తించాడు. నిప్పులు చెరిగే బంతులు సంధించి ఆతిథ్య జట్టుకు పట్టపగలే చుక్కలు చూపించాడు. అతడి ధాటికి దక్షిణాఫ్రికా తొలి సెషన్లోనే 23.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. 1991లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు అత్యల్ప స్కోరు ఇదే. ఆతిథ్య జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు డేవిడ్ బెడింగ్హమ్ (12), వెరినే (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ముకేశ్, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనుహ్యంగా కుప్పకూలిన భారత్
ఓపెనర్ రోహిత్ శర్మ (39; 50 బంతుల్లో), వన్డౌన్ బ్యాటర్ శుభ్మన్ గిల్ (36; 55 బంతుల్లో 5 ఫోర్లు), విరాట్ కోహ్లీ (46; 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) నిలకడగా ఆడటంతో తొలి ఇన్నింగ్స్లో మెరుగైన స్కోరు చేసేలా కనిపించింది. కానీ, ఒకే స్కోరు వద్ద చివరి ఆరు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. మొదటి రోజు టీ విరామ సమయానికి 111/4 స్కోరుతో నిలిచిన టీమ్ఇండియా.. 11 బంతుల వ్యవధిలో ఆరు వికెట్లను చేజార్చుకుంది. యశస్వి జైస్వాల్ (0), శ్రేయస్ అయ్యర్ (0), రవీంద్ర జడేజా (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. కేఎల్ రాహుల్ (8) కూడా నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, ఎంగిడి, నండ్రీ బర్గర్లకు మూడేసి వికెట్లు దక్కాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!